AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండింతల బంగారం అంటే నమ్మారు.. తీరా చూస్తే నిండా మునిగాడు..!

సామాన్యుడికి అందనంత ఎత్తులో బంగారం ధరలు చుక్కలనంటుతోంది. తులం బంగారం దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది. బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇలా బంగారం ధరలు మండిపోతున్న వేళ, కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా భావించి నకిలీ బంగారాన్ని అంటగట్టి అమాయకులను మోసం చేస్తున్నారు.

రెండింతల బంగారం అంటే నమ్మారు.. తీరా చూస్తే నిండా మునిగాడు..!
Fake Gold
M Revan Reddy
| Edited By: |

Updated on: May 18, 2025 | 11:11 AM

Share

సామాన్యుడికి అందనంత ఎత్తులో బంగారం ధరలు చుక్కలనంటుతోంది. తులం బంగారం దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది. బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇలా బంగారం ధరలు మండిపోతున్న వేళ, కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా భావించి నకిలీ బంగారాన్ని అంటగట్టి అమాయకులను మోసం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ప్రాంతం సంచార జాతికి చెందిన కొందరు సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వుకు వచ్చారు. స్థానికంగా కౌజు పిట్టలు, పావురాలు పట్టి విక్రయించి జీవనం సాగించేవారు. దీంతో వీరికి స్థానికులతో పరిచయం ఏర్పడింది. స్థానికుల ఫోన్ నెంబర్లు తీసుకుని తక్కువ ధరకు ఒకటి, రెండుసార్లు కౌజు పిట్టలను అందించి మరింత పరిచయం పెంచుకున్నారు. కొద్దిరోజుల తర్వాత సంచార జాతి చెందినవారు హిందూపూర్ కు వెళ్ళి పోయారు.

20 రోజుల క్రితం తమ సమీప బంధువు ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా అతడికి వ్యవసాయ పొలంలో లంకె బిందెలు దొరికాయని, మేళ్లచెరువులో పరిచయమైన శంభిరెడ్డికి ఫోన్ చేశారు. వాటిని ఎక్కడ అమ్మాలో తెలియడం లేదంటూ వీడియో చూపించారు. కావాల్సిన వారికి తక్కువ ధరకు అందిస్తామని శంభిరెడ్డికి చెప్పారు. దీంతో 15 రోజుల క్రితం శంభిరెడ్డి.. అనంతపురం జిల్లా హిందూపూర్ కు వెళ్లాడు. ఆయనకు శాంపిల్‌గా కొంత అసలు బంగారం ఉచితంగా ఇచ్చారు. ఇది మంచిదో కాదో చెక్ చేసుకుని డబ్బులతో రావాలని చెప్పారు. ఆ శాంపిల్ బంగారాన్ని మేళ్లచెర్వుకు తీసుకువచ్చి పరీక్షించగా మేలిమి బంగారం అని తేలింది.

తక్కువ ధరకు బంగారం లభిస్తుందనే ఆశతో శంభిరెడ్డి, వారం రోజుల క్రితం మరోసారి అనంతపురం జిల్లాకు వెళ్లి రూ.3 లక్షలతో బంగారం కొనుగోలు చేశాడు. ఆ బంగారాన్ని మేళ్లచెరువులో పరీక్షించగా నకిలీ బంగారంగా తేలింది. దీంతో మోసపోయానంటూ శంభిరెడ్డి లబోదిబోమంటూ ముగ్గురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మేళ్లచెరువు ఎస్‌ఐ పరమేష్‌ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు