యాప్లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తున్నాయని నమ్మి, 200 మంది ఇన్వెస్ట్ చేశారు. 500 రూపాయల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెడితే రోజు ఆదాయం వస్తుండడంతో గుడ్డిగా నమ్మారు ప్రజలు. సీమ అనే మహిళ వాట్సప్ చాట్ ద్వారా పెట్టుబడి పెట్టించినట్టు చెబుతున్నారు బాధితులు. న్యూఇయర్ ఆఫర్ అంటూ పది వేలకు లక్ష, లక్షకు ఐదు లక్షల ఆఫర్ అంటూ ఊరించింది మహిళ. ఆ కేడీ మాటలు నమ్మి భారీగా పెట్టబుడులు పెట్టారు గ్రామస్తులు. మొదటి రోజు భారీగా ఆదాయం వచ్చింది. ఇది గమనించి లాభం వస్తుందనే అత్యాశతో అప్పుచేసి మరి లక్షలు యాప్లో గుమ్మరించేశారు. ఆ తరువాత ఆఖరికి అసలు విషయం బయటపడింది. పెట్టుబడిగా పెట్టిన డబ్బుకు ఆదాయం రావడం బంద్ అయ్యింది. ఏంటా ఆరా తీసే ప్రయత్నం చేసే.. సదరు కిలాడీ మహిళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో తామంతా మోసపోయామని గ్రహించారు గ్రామస్తులు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. ఎలాగైనా తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని బాధిత ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Viral Video: అందమైన ‘అల్బీనో స్నేక్’..సొగసు చూడతరమా..!
IND vs SA: ఆఫ్రికన్ గడ్డపై బుమ్రా, శార్దుల్ విధ్వంసం.. గాయాలపాలైన సౌతాఫ్రికా బ్యాటర్లు..!
Sara Ali Khan : లవ్ అంటూ ఇద్దరిని ముంచావ్.. ఇప్పుడు మూడో వాడు అలా ఉండాలా..(Video)