AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం .. న్యాయం చేయాలని డీకే అరుణ డిమాండ్

Telangana: ఇటీవల రామయంపేట్ లో తల్లి కొడుకుల ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త మృతిపై బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న అరాచకాలను

Telangana: కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం .. న్యాయం చేయాలని డీకే అరుణ డిమాండ్
Dk Aruna
Surya Kala
|

Updated on: Apr 17, 2022 | 6:36 PM

Share

Telangana: ఇటీవల రామయంపేట్ లో తల్లి కొడుకుల ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త మృతిపై బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న అరాచకాలను బీజేపీ కార్యకర్త సాయి గణేష్ వెలుగులోకి తెస్తుండటంపై సాయి గణేష్ మీద కక్ష పెంచుకున్నారని.. పోలీసుల సహాయంతో అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు. పోలీసుల వేధింపులకు తీవ్ర మనస్తాపానికి గురైన.. సాయి గణేష్ పోలీసు స్టేషన్ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. మూడు వారాల్లో పెళ్లి పీటలెక్కాల్సిన సాయి గణేష్ మృతి చెందడం బాధాకరమన్నారు అరుణ.

చికిత్స పొందుతూ సాయి గణేష్ మీడియా కు ఇచ్చిన వాంగ్మూలంలో తన ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయ్, పోలీసు అధికారులు కారణమని స్పష్టం చేశాడు. కనుక వెంటనే పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సాయి గణేష్ మృతికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్, పోలీసు అధికారులపై హత్యనేరం కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి కొడుకుల ఆత్మహత్యలకు కారణమైన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, రామయంపేట్ మాజీ సిఐ తో పాటు ఆత్మహత్యకు కారణమైన ఏడుగురిపై కూడా హత్యానేరం కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామని డీకే అరుణ హెచ్చరించారు.

ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులే వారి మృతులకు కారణమవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతూ, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. తమ సహనాని పరీక్షించ వద్దని, సహనానికి కూడా హద్దులు ఉంటాయని టిఆర్ఎస్ నాయకులూ గుర్తించుకోవాలని అన్నారు అరుణ.

Also Read: US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 12మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం