AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమగ్ర సర్వేపై సైబర్‌ నేరగాళ్ల ఉచ్చు.. చిక్కారో ఇక అంతే సంగతులు..! తస్మాత్ జాగ్రత్త

ఒకవేళ నిజమేనని నమ్మి వీటిని క్లిక్‌ చేస్తే ప్రమాదకర యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతాయని తెలిపారు. తద్వారా ఫోన్‌ పూర్తిగా నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లి ఫొటోలు, బ్యాంకు ఖాతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి మనకు వచ్చే కాల్స్‌ను కూడా నేరస్థులు వినే అవకాశం ఉందన్నారు.  బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కొట్టేయడం, వ్యక్తిగత ఫోటోలతో బెదిరింపులకు దిగడం వంటివి జరుగుతాయన్నారు.

సమగ్ర సర్వేపై సైబర్‌ నేరగాళ్ల ఉచ్చు.. చిక్కారో ఇక అంతే సంగతులు..! తస్మాత్ జాగ్రత్త
Cybercrime
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Nov 09, 2024 | 5:12 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్‌ నేరగాళ్ల కన్ను పడింది. ఆన్‌లైన్‌లో సర్వే, డిజిటల్‌గా కొన్ని పత్రాలు పంపాలంటూ నేరస్థులు మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వేలో భాగంగా కాల్‌ చేశామని, అడిగిన పత్రాలు ఇవ్వాలంటూ కాల్స్‌ వస్తున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఇటీవల మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులకు పరిహారం పేరుతో మోసగించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని కొందరికి ఏపీకే ఫైళ్లు పంపించారు. నేరగాళ్లు ఇప్పుడు కుటుంబ సర్వేను అస్త్రంగా మార్చుకున్నారు. ఈ తరహా మోసాలపై ఇప్పటివరకూ కేసులు నమోదవ్వకున్నా సర్వే పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్, సందేశాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు.

కుటుంబ సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఇళ్లకు వచ్చి మాత్రమే వివరాలు నమోదు చేసుకుంటారు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. పని ఒత్తిడి, వ్యాపారంతో తీరిక లేకుండా ఉండడం, ఇతర ప్రాంతాల్లో పర్యటనల దృష్ట్యా సర్వే ఎప్పుడు పూర్తవుతుందోనని కొందరు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారినే సైబర్‌ ముఠాలు లక్ష్యంగా చేసుకునే అవకాశముంది. నేరగాళ్లు కుటుంబ సర్వేలో భాగంగా కాల్‌ చేస్తున్నామని.. ఆధార్, పాన్‌ తదితర గుర్తింపు పత్రాలు పంపాలని లేకపోతే తాము పంపించే లింకును క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని నమ్మిస్తారని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

వాట్సాప్‌కు వెబ్‌లింకులు, ఏపీకే(ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ) ఫైల్‌ పంపిస్తారని.. గూగుల్‌ ప్లేస్టోర్, ఐస్టోర్‌లో లేని యాప్‌లనే ఏపీకే ఫైళ్ల ద్వారా పంపిస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నిజమేనని నమ్మి వీటిని క్లిక్‌ చేస్తే ప్రమాదకర యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతాయని తెలిపారు. తద్వారా ఫోన్‌ పూర్తిగా నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లి ఫొటోలు, బ్యాంకు ఖాతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి మనకు వచ్చే కాల్స్‌ను కూడా నేరస్థులు వినే అవకాశం ఉందన్నారు.  బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కొట్టేయడం, వ్యక్తిగత ఫోటోలతో బెదిరింపులకు దిగడం వంటివి జరుగుతాయన్నారు. ఒక వేళ సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేసినా.. మోసపోయినా వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదుచేయాలని సూచిస్తున్నారు.

అయితే సైబర్ క్రైమ్ పోలీసులు సూచించేది ఏంటంటే సిబ్బంది ఎలాంటి పత్రాలు తీసుకోరు. సర్వే సిబ్బంది నేరుగా ఇళ్లకే వచ్చి సమగ్ర వివరాలు నమోదు చేసుకుంటారు. ఆధార్, రేషన్, పాన్‌ కార్డులతో సహా ఎలాంటి ధ్రువీకరణ డాక్యుమెంట్లనూ తీసుకోరు. ఫొటోలు అడగరు.. కెమెరాతో ఎటువంటి సమాచారాన్ని చిత్రీకరించరు. ఆధార్‌ అనుసంధానం అంటూ మెషిన్లు తీసుకొచ్చి వేలిముద్రలు సేకరిస్తామంటే అసలు నమ్మొద్దు. ఎవరైనా ఫోన్‌ చేసి ఆయా వివరాలు అడిగితే మోసమని అలర్ట్ అవ్వాల్సిందే అంటున్నారు.

అయితే సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేసినా, మోసపోయినా వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించి కంప్లైంట్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత