AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్‌..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..

ఈ నెల 29న దీక్ష దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతుల కోసం ధర్నా చేసే..

CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్‌..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..
Kcr
Sanjay Kasula
| Edited By: |

Updated on: Nov 16, 2021 | 7:20 PM

Share

TRS – CM KCR: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన TRSLP సమావేశం ఉంటుంది. వరిపై కిరికిరి నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరిచుకుంది. కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం. వరిధాన్యం కొనుగోళ్లు, కేంద్రం వైఖరిపైనే TRSLPలో ప్రధాన చర్చ ఉంటుంది. ఈ నెల 29న దీక్ష చేసే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్‌. దీక్ష ఎక్కడ చేయాలన్న దానిపై TRSLPలో నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 29న దీక్ష దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతుల కోసం ధర్నా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే రోజు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతుండటంతో.. కేంద్రంపై ఒత్తిడి పెంచడానకి ఇదే మంచి ఛాన్స్ అని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

యాసంగి రచ్చ రెండు ప్రభుత్వాల మధ్య యుద్ధంగా మారుతోంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కాస్తా.. దీక్షలు.. పాదయాత్రలుగా మారుతోంది. ప్రత్యర్థిని రైతుల ముందు దోషిగా నిలబెట్టేందుకు ఇరు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

మీరంటే మీరే రైతులను ముంచుతున్నారని.. మీరంటే మీరే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రెండు పార్టీల నేతలు పరస్పర విమర్శలు, డిమాండ్లకు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నాలో కూర్చోవాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: AP MPTC And ZPTC Elections 2021 Live: ఏపీలో కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికలు.. మందకొడిగా పోలింగ్‌..

వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు