Hyderabad: అమ్మో మళ్లీ వచ్చారు.. సంగారెడ్డి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. భారీగా బంగారం చోరీ..
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్చల్ చేసింది. సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. జిల్లాలోని..
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్చల్ చేసింది. సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. జిల్లాలోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేగింది. ఓ ఇంట్లో 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు దోపిడి దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బృందావన్ టీచర్స్ కాలనీలోని విల్లా నెంబర్ 8లో 12 తులాల బంగారం చోరీ జరిగింది. మరుసటి రోజు ఉదయం బంగారం చోరీ అయినట్లు గుర్తించారు బాధితులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో, విల్లాలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. చెడ్డీ గ్యాంగే ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. కొంతకాలంగా నగరంలో చెడ్డీగ్యాంగ్ కదలికలు ఆగిపోయాయి. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అమీన్పూర్ ఏరియాలో మళ్లీ ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోవడంతో వారి కోసం వేట ప్రారంభించారు పోలీసులు. చెడ్డీ గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..