AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ బీజేపీ నాయకులకు భద్రత పెంపు.. ఒకరికి వై… మరొకరి వై + సెక్యూరిటీ..

వై ప్లస్ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై ప్లెస్, వై కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లుగా సోమవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: ఆ బీజేపీ నాయకులకు భద్రత పెంపు.. ఒకరికి వై... మరొకరి వై + సెక్యూరిటీ..
Security
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 10, 2023 | 11:57 AM

Share

BJP: తెలంగాణ బీజేపీలని ఇద్దరు నాయకులకు వై ప్లస్ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై ప్లెస్, వై కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లుగా సోమవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈటల రాజేందర్‌కు “వై ప్లస్ కేటగిరి” కల్పించగా.. ధర్మపురి అర్వింద్‌కు “వై కేటగిరి”ని కేటాయించింది. భద్రతతోపాటు ఈ ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాల కేటాయించారు. ఇదిలావుంటే, తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని గతంలో ఈటల రాజేందర్ భార్య ఈటల జమున మీడియాతో చెప్పడం.. అలాగే, తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల రాజేందర్ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.

భద్రత అడిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదన్నారు ఈటల రాజేందర్. కాసేపట్లో ఇద్దరి నాయకుల ఇళ్లకు సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు చేరుకుని భద్రత ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

Y, Y+ అంటే ఆ సెక్యూరిటీ ఫోర్స్ ఎలా ఉంటుందంటే..

  • నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కి ఒక కమాండోతో సహా 8, నుంచి 11మందితో సెక్యూరిటీ
  • ఈటల రాజేందర్‌కు ఇద్దరు కమాండోలతో సహా 11మందికి పైగా భద్రతాసిబ్బంది
  • Y+ కేటగిరీ అనేది 2-4 కమాండోలు, పోలీసు సిబ్బందితో సహా 11 మంది సిబ్బందికి సంబంధించిన భద్రతా ఉంటారు.
  • Y కేటగిరీ అనేది 1 లేదా 2 కమాండోలు మరియు పోలీసు సిబ్బందితో సహా 8 మంది సిబ్బందికి సంబంధించిన భద్రతా వివరాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం