AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రాద్రి రామాలయంలో ఇంటి దొంగలు.. భక్తులు స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం

భద్రాచలం రామాలయంలో భక్తురాలు సమర్పించిన విలువైన పట్టుచీర మాయమైంది. సీసీ కెమెరాలకు చిక్కకుండానే అంతరాలయం నుంచి ఈ వస్త్రం అదృశ్యమవ్వడం దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ ఘటనపై ఈవో దామోదర్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భక్తులు ఆవేదన చెందుతున్నారు.

భద్రాద్రి రామాలయంలో ఇంటి దొంగలు.. భక్తులు స్వామి వారికి సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం
Bhadrachalam Ramayya Temple
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 6:39 PM

Share

ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్లు భద్రాచలం రామాలయంలో సిసి కెమెరాలకు చిక్కకుండా విలువైన పట్టుచీరలను మాయం చేస్తున్నారు దేవస్థానం సిబ్బంది. సీతారామలక్ష్మణులకు అలంకరణ నిమిత్తం హైదరాబాదుకు చెందిన జ్యోతి అనే భక్తురాలు పట్టు పంచలతో పాటు విలువైన పట్టు చీరను సమర్పించారు. దివ్య మూర్తులకు అలంకరణ అనంతరం అంతరాలయంలో రామాలయం ఊయలలో ఉన్న పట్టుచీర ..కొద్ది సేపటి తర్వాత మాయమైంది..

వీడియో ఇక్కడ చూడండి..

అంత చాక చాక్యంగా ఎవరు మాయం చేశారు..దేవస్థానంలో భాద్యత మరచిన ఉద్యోగులతో పాటు, విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంపై ఈవో దామోదర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే పట్టు చీర మాయమైన ఘటనపై విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు..ఎంతో సుదూర ప్రాంతాలు నుంచి భక్తితో స్వామివారిని దర్శించుకొని..వస్త్రాలు సమర్పిస్తే..ఇలా మాయం కావడం పట్ల భక్తులు ఆవేదన చెందుతున్నారు..ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us