Telangana: ఇంత సున్నితం ఏంట్రా బాబూ..! పదేళ్ల కొడుకు హెయిర్ కటింగ్ చేయించిన తండ్రి.. ఇంతలో తీవ్ర విషాదం
మహబూబాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో పసి ప్రాణం గాలిలో కలిసింది. తనకు నచ్చని విధంగా తండ్రి హెయిర్ కటింగ్ చేయించాడని.. పదేళ్ళ బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఆ కుటుంబం.

ఇటీవల చిన్నారులు చిన్నచిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, అంతెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం.. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు.. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతున్నారు.
తాజాగా ఇలాంటి విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో పసి ప్రాణం గాలిలో కలిసింది. తనకు నచ్చని విధంగా తండ్రి హెయిర్ కటింగ్ చేయించాడని.. పదేళ్ళ బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఆ కుటుంబం.
గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతరావు అనే రైతుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన హర్షవర్ధన్ (10) సీతానాగారం లోని హాస్టల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట హర్షవర్ధన్ తండ్రి కాంతారావు కటింగ్ షాపుకు తీసుకెళ్లారు. తనకు ఇష్టం లేని కటింగ్ చేపించారని తండ్రితో గొడవకు దిగిన బాలున్ని తండ్రి సముదాయించి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఇంటి వెనుక పొలం పనులు చేసుకుంటుండగా హర్షవర్ధన్ పురుగుల మందు సేవించాడు.
పదేళ్ల హర్షవర్ధన్కి నాలుగు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పురుగులు మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. బాలుడిని గమంచిన తల్లిదండ్రులు చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో చింతగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఈ హఠాత్ పరిణామంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
