ఓరి నాయనో.. పగబట్టిందా ఏందీ.. దాడి చేసి, చేతి వేళ్ళు పీక్కొని పరుగులు పెట్టిన కుక్క..!
వరంగల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్కలు అతని వేళ్ళు పీకేశాయి.. ఎడమచేతి ఉంగరం వేలును కొరికేసిన వీధి కుక్క తెగిపోయిన ఆ వేలుని గ్రామ శివారులో వదిలేసింది.. తీవ్ర అస్వస్థకుగురైన బాధితుడిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమువుతున్నాయి.

వరంగల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్కలు అతని వేళ్ళు పీకేశాయి.. ఎడమచేతి ఉంగరం వేలును కొరికేసిన వీధి కుక్క తెగిపోయిన ఆ వేలుని గ్రామ శివారులో వదిలేసింది.. తీవ్ర అస్వస్థకుగురైన బాధితుడిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమువుతున్నాయి.
ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో జరిగింది. ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.. ఒంటరిగా కనిపించిన వారిపై దాడి చేసి కాటేసింది. చిరుత సతీష్ అనే వ్యక్తిపై ఆ కుక్క దాడి చేస్తున్న క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని చేతి వేళ్లను కొరికేసింది. ఎడమ చేయి ఉంగరం వేలును పూర్తిగా కొరికేసిన పిచ్చికుక్క ఆ వేలును తెంచుకుపోయి గ్రామ శివారులో వదిలేసింది. ఆ కుక్క వెంట పరుగులు పెట్టిన స్థానికులు, తెగిపోయిన వేలును గ్రామ శివారులో గుర్తించారు.
కుక్కకాటుతో తీవ్ర అస్వస్థతకు గురైన చిరుత సతీష్ ను స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సతీష్ తో పాటు పలువురిపై ఆ కుక్క దాడిచేసి స్వైర విహారం సృష్టించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆస్పత్రికి క్యూ కట్టారు. కుక్కల భారీ నుండి కాపాడాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
