AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చెట్ల పొదల్లో తేనె తుట్టె.. పని చేసేందుకు వెళ్లిన ఉపాధి హామీ కూలీలు.. ఒక్కసారిగా

ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేసిన ఘటనలో 42 మందికి గాయాలయ్యాయి. చెట్ల పొదల్లో తేనె తుట్టి నుండి తేనెటీగలు లేచి ఉపాధి హామీ కూలీలపై బీభత్సం సృష్టించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉపాధి హామీ అధికారులను, వైద్య సిబ్బందిని అలర్ట్ చేశారు.

Telangana: చెట్ల పొదల్లో తేనె తుట్టె.. పని చేసేందుకు వెళ్లిన ఉపాధి హామీ కూలీలు.. ఒక్కసారిగా
Bee Attack (Representative image)
Naresh Gollana
| Edited By: |

Updated on: Apr 11, 2024 | 1:52 PM

Share

ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు ఒక్కసారిగా విరుచుకు పడ్డాయి. 120 మంది కూలీల బృందంపై తేనేటీగలు దాడికి దిగడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు కూలీలు పరుగులు తీశారు. ఈ దాడి ఘటనలో 42 మందికి గాయాలయ్యాయి. బాదితులను‌ హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దౌను గూడా గ్రామపంచాయతీ పరిధిలోని రేణిగూడ గ్రామ సమీపంలో గురువారం ఉదయం 120 మంది కూలీలు ఉపాది‌హామీ పనుల్లో భాగంగా మట్టి తవ్వకం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ అక్కడే చెట్ల పొదల్లో ఉన్న తేనె తుట్టి నుండి తేనెటీగలు ఒక్కసారిగా లేచి ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల బృందంపై బీభత్సం సృష్టించాయి. ఈ దాడిలో తేనేటీగల ముల్లులు గుచ్చుకుని 40 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది మహిళలకు స్వల్ప గాయాలవగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వైద్యారోగ్యశాఖ సిబ్బంది 5 ప్రత్యేక అంబులెన్స్ లను ఏర్పాటు చేసి బాదితులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, రిమ్స్ డాక్టర్లు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం తేనీటీగల దాడిలో గాయపడ్డ బాదితుల ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని.. కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటం ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..