మరో దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. ఒకే రోజు ఇన్నా..

మరోవైపు మేడ్చల్ జిల్లా... పీర్జాది గూడ, బుద్దా నగర్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భూపాల్ రెడ్డిపై కుక్కలు ఎటాక్‌ చేశాయి. ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తుండగా వీధి కుక్కలు దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

మరో దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. ఒకే రోజు ఇన్నా..
Follow us

|

Updated on: Mar 09, 2023 | 10:14 PM

నిన్నగాక మొన్న ప్రదీప్‌ని పొట్టనపెట్టుకున్న కుక్కలు… గత కొద్దిరోజులుగా నగరంలో భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఒక్క రోజే రెండు చోట్ల కుక్కలు జనంపై ఎటాక్‌ చేశాయి. కుక్కల వరుస దాడులకు పసిపిల్లలు బలైపోతున్న దుర్ఘటనలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. కుక్కల దాడులతో పసిబిడ్డలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మరోసారి వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. అత్తాపూర్ డివిజన్ తేజస్వి నగర్ కాలనీలో సన్‌రైజ్‌ టవర్స్ దగ్గర ఓ మూడేళ్ళ చిన్నారిని వదిలి…పిల్లాడి తల్లీతండ్రీ కూలి పనిలోకి వెళ్ళారు. రెండేళ్ల బాబు అక్కడే ఆడుకుంటుండగా దాదాపు పదిపన్నెండు వీధి కుక్కలు పిల్లాడిపై హఠాత్తుగా ఎటాక్‌ చేశాయి. దీంతో హడలిపోయిన మూడేళ్ళ పసివాడు ఏడుపులంకించుకున్నాడు. కుక్కలు బాలుడిని తరుముకుంటూ వెంబడించాయి. పిల్లవాడి ఏడుపు విన్న స్థానికులు పరిగెత్తుకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కుక్కలను తరిమేసి, బాలుడిని కాపాడారు స్థానికులు…

మరోవైపు మేడ్చల్ జిల్లా… పీర్జాది గూడ, బుద్దా నగర్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భూపాల్ రెడ్డిపై కుక్కలు ఎటాక్‌ చేశాయి. ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తుండగా వీధి కుక్కలు దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

గతంలో కూడా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తరువాత మర్చిపోతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..