AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓరి నాయనా.. మళ్లీ వచ్చిన మాయదారి వైరస్.. ఆ స్కూల్లో 15 మందికి పాజిటివ్‌

దేశంలో మరోసారి కరోనా విజృంభించడానికి సిద్ధమవుతోందా.? అంటే తాజాగా గణంకాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ బుధవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి....

Telangana: ఓరి నాయనా.. మళ్లీ వచ్చిన మాయదారి వైరస్.. ఆ స్కూల్లో 15 మందికి పాజిటివ్‌
Representative Image
Narender Vaitla
|

Updated on: Apr 06, 2023 | 6:17 PM

Share

దేశంలో మరోసారి కరోనా విజృంభించడానికి సిద్ధమవుతోందా.? అంటే తాజాగా గణంకాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ బుధవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 25 వేలు దాటాయి. 24 గంటల్లోనే 5 వేల 335 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 15 మంది మరణించారు.

ఇదిలా ఉంటే తెలంగాణలోనూ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలుర గురుకుల పాఠశాలలో ఏకంగా 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. హాస్టల్‌లో ఉంటున్న కొందరు విద్యార్థులకు జ్వరం, జలుబు ఉండడంతో గురువారం వైద్యులు పరీక్షలు నిర్వహించగా 15 మంది పాజిటివ్‌గా నిర్ధారించారు.

వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకే పాఠశాలలో 15 మంది కరోనా సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో ఉన్న మిగతా విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్‌ చేరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!