పాము కాటేస్తే.. వైద్యుడు దగ్గరలేకపోతే.. టేక్ దిస్ యాప్ హెల్ప్
పాము కాటేస్తే పరిస్థితి భయానకంగా ఉంటుంది. ఓ వైపు నొప్పితో పాటు.. విష సర్పాలు కాటేసినప్పుడు బాడీ పాయిజన్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు గ్రామాల్లో నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందిస్తుంటారు. అయితే ఈ క్రమంలో అనేక సార్లు చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన భారత్లో ప్రతియేట దాదాపు 28 లక్షల మంది పాముకాటుకు గురవుతుంటారు. వీరిలో దాదాపు 47 […]
పాము కాటేస్తే పరిస్థితి భయానకంగా ఉంటుంది. ఓ వైపు నొప్పితో పాటు.. విష సర్పాలు కాటేసినప్పుడు బాడీ పాయిజన్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు గ్రామాల్లో నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందిస్తుంటారు. అయితే ఈ క్రమంలో అనేక సార్లు చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన భారత్లో ప్రతియేట దాదాపు 28 లక్షల మంది పాముకాటుకు గురవుతుంటారు. వీరిలో దాదాపు 47 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఎంటంటే.. పాములు కాటేసినప్పుడు వారికి వైద్య సహాయం అందకపోవడమే. అంతేకాదు..పాము కరిచినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి సరైన అవగాహన లేకపోవడమే. ఈ కారణాలవల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అనేక గ్రామాల్లో పాములు కాటేస్తే.. ఏంచేయాలన్న దానిపై అనేక అవగాహన సదస్సులు జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు.. అటు ఆన్2లైన్లో కూడా బోలేడంత సమాచారం ఉంటుంది. కానీ వాటి గురించి తెలుసుకోకపోవడం కారణంగానే చాలా మంది మృత్యువాత పడుతుంటారు. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు స్వచ్ఛంద సంస్థ అయిన వైల్డ్లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నడుంబిగించింది. ‘ఇండియన్ స్నేక్స్’ పేరుతో ఓ యాప్ను రూపొందించింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. 10 ఎంబీ కన్నా తక్కువ సైజ్లోనే ఈ యాప్ ఉంటుంది. మీరు కూడా ఈ యాప్పై ఓ లుక్ వేయండి.