AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone: సామ్‌సంగ్ నుంచి నయా స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఇక ఐఫోన్‌కు చుక్కలే..!

భారతదేశంలో సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ప్రీమియం సెగ్మెంట్‌లో చాలా మంది యాపిల్ ఐఫోన్లను వినియోగిస్తున్నా కొంత మంది మాత్రం సామ్‌సంగ్ ఫోన్లను వాడుతూ ఉన్నారు. అయితే భారత్‌లో ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్‌లో రారాజుగా నిలవాలని సామ్‌సంగ్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ద్వారా యాపిల్ ఫోన్లక గట్టి పోటీనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Smart Phone: సామ్‌సంగ్ నుంచి నయా స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఇక ఐఫోన్‌కు చుక్కలే..!
Samsung S25 Edge
Nikhil
|

Updated on: May 14, 2025 | 3:34 PM

Share

ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఆపిల్‌ను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇటీవల ఏఐ లక్షణాలతో కూడిన ఎస్-25 ఎడ్జ్‌ను లాంచ్ చేసింది. పోర్టబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సామ్‌సంగ్ ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, థర్మల్ సిస్టమ్‌లతో సహా అంతర్గత భాగాల విడ్త్‌ను తగ్గించడానికి ఈ స్మార్ట్ ఫోన్‌లో నిర్మాణాత్మక మార్పులు చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ విడుదలతో సామ్‌సంగ్ యాపిల్ ఫోన్స్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఎస్-25 ఎడ్జ్ మే 23న దక్షిణ కొరియాలో, మే 30న యునైటెడ్ స్టేట్స్‌లో అమ్మకానికి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. చైనా, యూరప్‌తో సహా దాదాపు 30 దేశాలకు దీనిని విడుదల చేస్తామని సామ్‌సంగ్ ప్రతినిధులు చెబుతున్నారు. 1,099 డాలర్ల నుంచి ప్రారంభమయ్యే ఈ మోడల్ 6.7 అంగుళాల (170 మిమీ) స్క్రీన్, 5.8 మిల్లీమీటర్ల మందపాటి బాడీతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ప్రాథమిక ఎస్-25 మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఎస్-25 ఎడ్జ్‌లో సామ్‌సంగ్ తాజా అంతర్నిర్మిత ఏఐ ఫంక్షన్‌లు ఉన్నాయి. అలాగే వీటిలో మల్టీమోడల్ ఏఐ కూడా ఉంది. వినియోగదారులు వాయిస్ ద్వారా రియల్‌టైమ్‌లో సంభాషించడానికి, అలాగే కెమెరాను ఉపయోగించి ప్రశ్నలు అడగడానికి అనుమతిస్తుంది.

అయితే సామ్‌సంగ్ ఎస్-25 ఎడ్జ్ ఫోన్ వాడే సమయంలో హీటింగ్ వచ్చే ప్రమాదం ఉందని కొంత మంది నిపుణులు చెబుతున్నా సామ్‌సంగ్ ప్రతినిధులు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో సామ్‌సంగ్ ప్రపంచంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ విక్రేతగా మారింది. ప్రపంచ మార్కెట్‌లో 20 శాతాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే 19 శాతం వాటాను కలిగి ఉన్న యాపిల్ తృటిలో అధిగమించిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే టారిఫ్ ప్రమాదాలు డిమాండ్‌ను బలహీనపరిస్తే రెండో త్రైమాసిక షిప్‌మెంట్‌లు ప్రభావితమవుతాయని గత నెలలో సామ్‌సంగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి