NASA Perseverance Rover: అంగారక గ్రహంపై అద్భుతం.. అచ్చం భూమిపై ఉన్నట్లుగానే మార్స్‌పైనా..

NASA Perseverance Rover: భూమిపై ‘ఇంద్రధనస్సు’ ఏర్పడటం సర్వ సాధారణం. అందమైన ‘ఇంద్రధనస్సు’ను ఎన్నోసార్లు మనం చూసుంటాం.

NASA Perseverance Rover: అంగారక గ్రహంపై అద్భుతం.. అచ్చం భూమిపై ఉన్నట్లుగానే మార్స్‌పైనా..
Mars Rover
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 07, 2021 | 7:35 AM

NASA Perseverance Rover: భూమిపై ‘ఇంద్రధనస్సు’ ఏర్పడటం సర్వ సాధారణం. అందమైన ‘ఇంద్రధనస్సు’ను ఎన్నోసార్లు మనం చూసుంటాం. మరి ఇతర గ్రహాలపై ఏర్పడే ‘ఇంద్రధనస్సు’ను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. మార్స్‌ అధ్యయనం కోసం నాసా పంపిన పర్సీవరెన్స్ రోవర్.. అద్భుతమై దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది. భూమిపైనే కాదు.. అంగారకుడిపైనా ఇంద్రధనస్సు ఏర్పడుతుందని ప్రపంచానికి చాటి చెప్పింది. అవును.. మార్స్‌పైన ఏర్పడిన ఇంద్రధనస్సు ను పర్సీవరెన్స్ రోవర్ తన కెమెరాలో బంధించింది. ఆ చిత్రాన్ని నాసా అంతరిక్ష కేంద్రానికి పంపించింది. ఈ ఫోటోను నాసా తాజాగా విడుదల చేసింది. ఇంద్రధనుస్సు ఏర్పడటం.. వర్షం రాకకు సూచనగా భావిస్తారు. ఆ నేపథ్యంలోనే మార్స్‌పైనా వర్షాలు కురుస్తాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో నాసా సైటింస్ట్‌లు కూడా తమ పరిశోధనల్లో వేగం పెంచారు.

భూమికి సమీపంగా ఉండి.. దాదాపు భూమిని పోలి ఉన్న అంగాకర గ్రహంపై జీవి ఉనికి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు మార్స్‌పై అధ్యయనానికి వరుస ప్రయోగాలు చేపడుతున్నాయి. చాలా దేశాలు ఉపగ్రహాలను పంపించి మార్స్‌ను అధ్యయనం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగాకారక గ్రహం అధ్యయనం కోసం పర్సీవరెన్స్ రోవర్‌ను పంపించింది. అంగారక గ్రహంపై విజయవంతంగా దిగిన ఆ రోవర్.. ఆ గ్రహానికి సంబంధించిన అనేక రహస్యాలను చేధించడం బిజీ బిజీగా ముందుకు కదులుతోంది. జీవం ఉనికికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే అనేక ఫోటోలను పంపిన రోవర్.. తాజాగా మార్స్‌పై ఇంద్రధనుస్సు ఏర్పడటాన్ని గుర్తించింది. దానికి సంబంధించిన ఫోటోను కూడా నాసా కేంద్రానికి పంపించింది.

Rainbow In Mars

Rainbow In Mars

ఈ ఫోటోలను పరిశీలించిన సైటింటిస్ట్‌లు పలు విధాలుగా అంచనాలు వేస్తున్నారు. వాస్తవానికి ఈ ఇంద్రధనస్సు వర్షాలకు సూచనగా పేర్కొంటారు. దాంతో మార్స్‌పైనా వర్షాలు పడే అవకాశం ఉందా అనే అంశంపై ఆలోచనలు చేస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తల ప్రకారం.. మార్స్‌పై వర్షం పడే అవకాశం లేదు. అందుకని, ఈ ఇంద్రధనస్సుని శాస్త్రవేత్తలు ‘డస్ట్‌బౌ’ గా భావిస్తున్నారు. అంటే నీటి బింధువులకు బదులుగా.. దుమ్ము, దూళి వల్ల ఈ ధనస్సు ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తల భావన. నీటి ఆవిరతో ఏర్పడే దానిని ఇంద్రధనస్సు అని పిలుస్తాం.

అయితే, ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కెమెరాలో చూపినట్లుగా రెయిన్‌బో ఉండకపోవచ్చంటున్నారు. కాంతి కిరణాలు కెమెరా లెన్స్‌పై పడటంతో ఆ కిరణాలు విచ్చిన్నం చెంది ఇలా కనిపించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉంటే.. ‘డస్ట్‌బౌ’ వినడానికి మనందరికీ కొత్త అయినప్పటికీ.. మార్స్‌కు మాత్రం కొత్తేం కాదు. మార్స్‌పై ఎక్కువగా ‘ఐఎస్‌బౌ’లు ఏర్పడుతుంటాయి. 2015లో నాసా ‘ఏదైనా అడుగొచ్చు’(ఆస్క్‌ మి ఎనీథింగ్) అనే కార్యక్రమం నిర్వహించిన సందర్భంలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. 1990లో పాథ్‌ఫైండర్ మిషన్ సందర్భంలోనే మార్స్‌పై ‘ఐస్‌బౌ’ను తొలిసారి కనుగొన్నట్లు నాసా వెల్లడించింది.

Also read:

West Bengal Assembly Election 2021 Live: రసవత్తరంగా బెంగాల్, అస్సాం ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్..

Thalapathy Vijay Cycles: నటుడు విజయ్ కుమార్‌పై నెటిజన్ల ఫైర్.. వివరణ ఇచ్చుకున్న తలాపతి సోషల్ మీడియా సైన్యం

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు