Global Warming: గ్లోబల్ వార్మింగ్ పాపం పూర్తిగా మనుషులదే.. వెల్లడించిన శాస్త్రవేత్తలు

గ్లోబల్ వార్మింగ్‌లో పాపం 99.9 శాతం మనుషులదే. గత 8 సంవత్సరాలలో నిర్వహించిన 88,125 అధ్యయనాల ఫలితాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి.

Global Warming: గ్లోబల్ వార్మింగ్ పాపం పూర్తిగా మనుషులదే.. వెల్లడించిన శాస్త్రవేత్తలు
Global Warming
Follow us

|

Updated on: Oct 20, 2021 | 8:16 PM

Global Warming: గ్లోబల్ వార్మింగ్‌లో పాపం 99.9 శాతం మనుషులదే. గత 8 సంవత్సరాలలో నిర్వహించిన 88,125 అధ్యయనాల ఫలితాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. 2012 నుండి 2020 వరకు, వివిధ పత్రికలలో ప్రచురించబడిన 88 వేలకు పైగా అధ్యయనాలు చదివి అర్థం చేసుకున్నామని పరిశోధన నిర్వహించిన న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మార్క్ లైనస్ చెప్పారు. గ్లోబల్ వార్మింగ్‌కు మానవులే కారణమని ఈ అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయని ఆయన చెప్పారు.

యూకేలో వాతావరణ మార్పుపై ఒక పెద్ద సమావేశం జరగబోతున్న సమయంలో పరిశోధన ఫలితాలు వచ్చాయి. ఈ సమావేశానికి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పెద్ద నాయకులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలో చర్చించడం ఈ సమావేశం లక్ష్యం. పెరుగుతున్న ఉష్ణోగ్రతను నియంత్రించడానికి 2015 లో పారిస్ వాతావరణ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గ్లోబల్ వార్మింగ్‌ను ఆపడం ప్రపంచ నాయకులకు పెద్ద సవాలుగా పరిణమిస్తోంది.

2015 లో పారిస్ వాతావరణ ఒప్పందం అంటే ఏమిటి?

195 దేశాల ప్రభుత్వాలు నవంబర్ 30 నుండి డిసెంబర్ 11 వరకు ఫ్రాన్స్‌లోని పారిస్‌లో సమావేశమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వాలు నిర్దేశించాయి. తద్వారా ఉష్ణోగ్రతను 2 డిగ్రీలు తగ్గించవచ్చు.

గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాలివే..

మొదటి ముప్పు: మంచు తగ్గుతుంది, సముద్ర మట్టం పెరుగుతుంది

వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) తన తాజా నివేదికలో 2021 – 2025 మధ్య, ఒక సంవత్సరం రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉంటుందని పేర్కొంది.WMO ప్రధాన కార్యదర్శి ప్రొ. పెట్రీ తలాస్ ప్రకారం, ఉష్ణోగ్రతలు పెరగడం వలన మంచు తగ్గుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఇది వాతావరణాన్ని మరింత దిగజారుస్తుంది. ఫలితంగా ఆహారం, ఆరోగ్యం, పర్యావరణం, అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి వేగంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

రెండవ ప్రమాదం: మానవ ఎత్తు, మెదడు పరిమాణం తగ్గవచ్చు

కేంబ్రిడ్జ్ మరియు ట్యూబిజెన్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు వాతావరణ మార్పు మానవ ఎత్తు, మెదడును తగ్గిస్తుందని చెప్పారు. గత మిలియన్ సంవత్సరాలలో, ఇది మనుషుల ఎత్తు, వెడల్పుపై ప్రభావం చూపింది. ఇది నేరుగా ఉష్ణోగ్రతకి సంబంధించినది. ఏటా ఉష్ణోగ్రత పెరుగుతున్న తీరు.. వేడి పెరుగుతున్న తీరు తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

మూడవ ముప్పు: 40% సొరచేపలు.. రే చేపలు అంతరించిపోయే దశలో ఉన్నాయి

ప్రపంచంలోని 40 శాతం సొరచేపలు.. రే చేపలు అంతరించిపోయే దశలో ఉన్నాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల నివేదిక పేర్కొంది. దీనికి కారణం వాతావరణ మార్పు, అతిగా చేపలు పట్టడం. 8 సంవత్సరాల పాటు చేపలపై పరిశోధన 2014 లో, వాటి అంతరించిపోయే ప్రమాదం 24 శాతం ఉందని, అది ఇప్పుడు రెట్టింపు అయ్యిందని వెల్లడించింది. వాతావరణ మార్పు అటువంటి చేపలకు సమస్యను పెంచుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది వారికి కావలసిన ఆవాసాల కోసం పర్యావరణాన్ని తగ్గించడమే కాకుండా సముద్ర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది.

నాల్గవ ముప్పు: దక్షిణాసియాకు ముప్పు పెరుగుతుంది

అమెరికా, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల శాస్త్రవేత్తలు ప్రపంచ జనాభాలో నాలుగోవంతు మంది దక్షిణాసియాలో నివసిస్తున్నారని ప్రపంచ మెట్రోలాజికల్ సంస్థ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఇప్పటికే వేడితో చాలా బాధపడుతోంది. అటువంటి పరిస్థితిలో, పెరుగుతున్న ఉష్ణోగ్రత ఇక్కడ పెద్ద ప్రమాదం. ఈ ప్రాంతంలోని 60 శాతం ప్రజలు వ్యవసాయం చేస్తారు. వారు బహిరంగ మైదానంలో పని చేయాలి, కాబట్టి వారు వేడి స్ట్రోక్‌కి గురవుతారు.

ఇవి కూడా చదవండి: Telegram App: వంద కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న టెలిగ్రామ్ యాప్.. పదిహేను రోజుల్లో భారీగా చేరిన యూజర్లు..

Future Tech 2021: భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్యూచర్ టెక్ 2021 ఈవెంట్.. ఆన్‌లైన్‌లో మీరూ పాల్గొనవచ్చు ఇలా!

India vs Pakistan: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన దుబాయ్.. కాశ్మీర్‌‌లో మౌలిక సదుపాయాల కోసం భారీ పెట్టుబడులు!