AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3: ఎల్‌ అండ్‌ టీ నుంచి గోద్రెజ్ వరకు.. ఈ కంపెనీలు చంద్రయాన్‌ 3కి ఎంతో సహకారం..

భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమంలో చంద్రయాన్-3 ఒక ముఖ్యమైన మైలురాయి. ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో ఇప్పటికే చంద్రుని మిషన్‌ను నిర్వహించింది. అంగారక గ్రహం వరకు తన ఉనికిని నమోదు చేసింది. అయితే ఈ మిషన్ మిగతా వాటి కంటే భిన్నంగా ఉంది. ఎప్పుడూ చీకట్లో ఉండే చంద్రుడి ఆ భాగంలో దిగే ప్రయత్నం ఈ మిషన్. ఇప్పటివరకు..

Chandrayaan-3: ఎల్‌ అండ్‌ టీ నుంచి గోద్రెజ్ వరకు.. ఈ కంపెనీలు చంద్రయాన్‌ 3కి ఎంతో సహకారం..
Chandrayaan 3
Subhash Goud
|

Updated on: Aug 23, 2023 | 11:42 AM

Share

క్రికెట్‌, బాలీవుడ్‌ను ఒక మతంలా అనుసరించే దేశంలో నేడు అందరి చూపు ఆకాశం వైపే ఉంది. భారతదేశం చంద్రయాన్-3 ఆగస్టు 23 సాయంత్రం చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయబోతోంది. చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండ్ అయిన వెంటనే అంతరిక్ష యాత్ర కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ల్యాండింగ్ అప్‌డేట్ కోసం కోట్లాది మంది భారతీయులు మాత్రమే కాకుండా, ప్రపంచం మొత్తం చూస్తోంది. వారందరితో పాటు చారిత్రాత్మక క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అనేక కంపెనీలు ఈ మిషన్‌ను విజయవంతం చేయడంలో సహకరించాయి.

అందుకే ఈ మిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైనది

భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమంలో చంద్రయాన్-3 ఒక ముఖ్యమైన మైలురాయి. ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో ఇప్పటికే చంద్రుని మిషన్‌ను నిర్వహించింది. అంగారక గ్రహం వరకు తన ఉనికిని నమోదు చేసింది. అయితే ఈ మిషన్ మిగతా వాటి కంటే భిన్నంగా ఉంది. ఎప్పుడూ చీకట్లో ఉండే చంద్రుడి ఆ భాగంలో దిగే ప్రయత్నం ఈ మిషన్. ఇప్పటివరకు చంద్రుని ఈ భాగం అన్వేషించబడలేదు. అలాగే మిషన్ విజయవంతమైతే ఆ భాగంలో ఇది మొదటి సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది.

స్పేస్‌టెక్ పరిశ్రమలో 400 ప్రైవేట్ కంపెనీలు

ఒక్కమాటలో చెప్పాలంటే నాసా, రష్యా, చైనా అంతరిక్ష సంస్థలు ఇప్పటివరకు చేయలేని పని ఇస్రో చేయడానికి చాలా దగ్గరగా ఉంది. ఇస్రో ఒక్కరోజులో ఈ మైలురాయిని సాధించలేదు. దీని వెనుక దాదాపు 6 దశాబ్దాల కృషి ఉంది. ఈ 6 దశాబ్దాలలో ఇస్రో అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే కాకుండా దేశంలో కొత్త పరిశ్రమను అభివృద్ధి చేసింది. దీనిని స్పేస్‌టెక్ పరిశ్రమగా పిలుస్తారు. అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఈ రంగంలో సుమారు 400 ప్రైవేట్ కంపెనీలు చురుకుగా ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఇస్రో మిషన్‌లో విలువైన సహకారం అందించాయి.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ సంస్థలు కూడా సహకరించాయి:

ఇస్రో ఈ మిషన్‌కు సహకరించడంలో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. కొన్ని కంపెనీలు బ్యాటరీలపై పని చేస్తే, మరికొన్ని కంపెనీలు రాకెట్లను తయారు చేశారు. వాటిలో అత్యంత కీలకంగా ఉన్న పేరు L&T. ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కంపెనీ మిషన్ కోసం బూస్టర్, సబ్‌సిస్టమ్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వ సంస్థ భేల్‌ (BHEL) కూడా ఎంతో సహకారం అందించింది. ఈ కంపెనీ బ్యాటరీని సరఫరా చేసింది. కేరళ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంటే కెల్ట్రాన్ ఎలక్ట్రానిక్ పవర్ మాడ్యూల్, టెస్ట్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది.

చంద్రునిపై భారతదేశ జెండాను నాటబోతున్న ఈ మిషన్‌కు సహకరిస్తున్న కంపెనీల జాబితా ఇది మాత్రమే కాదు. ప్రైవేట్ కంపెనీ వాల్‌చంద్ ఇండస్ట్రీస్ మిషన్‌లోని అనేక భాగాలను తయారు చేసింది. అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇస్రో కోసం ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాలు, స్పేస్‌క్రాఫ్ట్ పేలోడ్‌లు, గ్రౌండ్ సిస్టమ్‌ల కోసం అనేక ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సబ్‌సిస్టమ్‌లను తయారు చేసింది. అలాగే గోద్రెజ్ & బోయ్స్ లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్, శాటిలైట్ థ్రస్టర్, కంట్రోల్ మాడ్యూల్ భాగాలను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ గోద్రెజ్ ఏరోస్పేస్ అనుబంధ సంస్థ, మంగళయాన్ కోసం కూడా పనిచేసింది.

భారతదేశం చంద్రయాన్ -3 మిషన్ ల్యాండర్ విక్రమ్ ఈ సాయంత్రం చంద్రుని ఉపరితలంపైకి రాగానే, అంతరిక్షంలో మానవ విజయాల జాబితాలో లిఖించబడుతుంది. విజయవంతమైన మిషన్ భారతదేశం స్థాయిని పెరిగిపోతుంది. దానితో పాటు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష సాంకేతిక పరిశ్రమ కొత్త కోణాన్ని, ప్రధాన ప్రోత్సాహాన్ని పొందుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us