AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డు.. భారత్ ఖాతాలో ఏడు పతకాలు

Tokyo Olympics 2020: టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణ పతకంతో.. మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డు.. భారత్ ఖాతాలో ఏడు పతకాలు
Neeraj Chopra Gold Medal
Janardhan Veluru
|

Updated on: Aug 07, 2021 | 6:47 PM

Share

Tokyo Olympics 202: టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణ పతకంతో.. మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో అత్యధికంగా ఏడు పతకాలు చేరాయి. శనివారంనాడు భారత జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ అభినవ్ బింద్రా(2008 బీజింగ్ ఒలింపిక్స్) తర్వాత ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన రెండో ఆటగాడిగా హర్యానాకు చెందిన నీరజ్ ఘనత సాధించాడు.

అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రాదే ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన తొలి పసిడి పతకం కావడం విశేషం. దీంతో 100 ఏళ్ల భారత కల నెరవేరింది. శుక్రవారంనాటి వరకు భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు ఉన్నాయి. నీరజ్ చోప్రా స్వర్ణం సాధించటానికి ముందు.. రెజ్లర్ భజరంగ్ ఉడుంపట్టుతో కాంస్యం సాధించాడు. దీంతో శనివారం ఒక్కరోజే భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి.

నీరజ్ చోప్రా పసిడి గెలిచిన సందర్భం..వీడియో

టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ ఖాతాలో మొత్తం ఏడో పతకాలు చేరగా.. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్ క్రీడాల్లో అత్యధిక పతకాలు టోక్యో ఒలంపిక్స్‌లోనే సాధించడం విశేషం. 2012 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ 6వ పతకాలు సాధించడమే ఇప్పటి వరకు రికార్డుగా ఉంటూ వచ్చింది. మొత్తం ఏడు పతకాలతో భారత్ ఇప్పుడు సరికొత్త రికార్డును నమోదుచేసుకుంది.

నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణ పతకంతో టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 47వ స్థానానికి ఎగబాకింది. చైనా 38 స్వర్ణాలు, 30 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 86 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలుస్తోంది. 34 స్వర్ణాలు, 37 రజతాలు, 32 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించిన అమెరికా రెండో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం పతకాల సంఖ్యలో అమెరికా ముందున్నా..స్వర్ణ పతకాలు సంఖ్య పరంగా చైనా కంటే వెనుకబడింది.

ఇదిలా ఉండగా టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు.

Also Read..

Sachin Tendulkar : ఆ షాట్‌కి సచిన్‌ ఫ్యాన్‌ అయిపోయాడు..! అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు..

Ananta Sriram: గేయ రచయిత అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు.. కారణం ఇదే..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..