Tokyo Olympics 2021: రాయిటర్స్‌పై చైనా ఆగ్రహం.. మహిళా అథ్లెట్ ఫొటో అభ్యంతరకరంగా చూపిస్తారా అంటూ..!

చైనాకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్ హౌ జిహుయి టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. అయితే ఆమె ఫొటోను రాయిటర్స్ భయంకరంగా చూపించిందంటూ చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగ్గులేకుండా ఇలా ఎలా ప్రచురిస్తారని విమర్శించింది.

Tokyo Olympics 2021: రాయిటర్స్‌పై చైనా ఆగ్రహం.. మహిళా అథ్లెట్ ఫొటో అభ్యంతరకరంగా చూపిస్తారా అంటూ..!
China
Follow us

|

Updated on: Jul 25, 2021 | 12:03 PM

China vs Reuters: జపాన్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో చైనా వెయిట్ లిఫ్టర్ హౌ జిహుయి బంగారు పతకం సాధించింంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, రాయిటర్స్ ప్రచురించిన ఓ ఫొటోపై చైనా విమర్శలు గుప్పించింది. బ్రిటన్ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ ఫొటోను విడుదల చేసింది. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘లౌసీ పిక్చర్’ అని పిలుస్తూ.. విమర్శలు గుప్పించింది. రాజకీయాలను ఆటలోకి లాగవద్దంటూ రాయిటర్స్‌కు సూచించింది. ఈ మేరకు చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో వెయిట్ లిఫ్టర్ ఫొటోను కూడా పంచుకుంది.

గ్లోబల్ టైమ్స్ తన ట్వీట్‌లో ‘రాయిటర్స్.. దయచేసి ఒలింపిక్స్ స్ఫూర్తిని గౌరవించండి. వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని గెలిచిన హౌ జిహుయి ఫొటో అసభ్యకరంగా ప్రచురించారని’ శ్రీలంకలోని చైనా రాయబార కార్యాలయం విమర్శించింది. ‘రాజకీయాలను ఆటలకు ముడి పెట్టవద్దని సూచించింది. సిగ్గులేనిదిగా ప్రవర్తించింది’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది. చైనా ప్లేయర్ హౌ జిహుయి, భారత మహిళా అథ్లెట్ మీరాబాయి చానుతో తుది మ్యాచ్లో పోటీపడ్డారు. ఇందులో జిహుయి బంగారు పతకం, చాను రజత పతకం సాధించారు. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి మొత్తం 202 కిలోలు ఎత్తింది. చైనాకు చెందిన జిహుయి 210 కిలోలను ఎత్తి బంగారు పతకం సాధించింది. అలాగే ఇండోనేషియా క్రీడాకారిణి కెంటికా విండి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో చాను భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది.

పాశ్చాత్య దేశాలతో చైనా సంబంధాలు.. పాశ్చాత్య దేశాలతో చైనా సంబంధాలు చాలా ఉద్రిక్తతంగా మారుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా ఏ దేశంతోనూ సఖ్యత లేదు. జీ 7 దేశాల సమావేశం తరువాత, చైనా (చైనా జీ 7 కంట్రీస్ కార్టూన్) ఒక కార్టూన్‌ను విడుదల చేసింది. ఇందులో పాల్గొన్న దేశాధినేతలందరినీ జంతువుల కార్టూన్‌లుగా చూపించారు. ఆయా దేశాల జెండాలతో టోపీలు ధరించినట్లుగా ఫొటోలు విడుదల చేశారు. ఇలాంటివి ప్రతిరోజూ విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి వాటిపై ఇతర దేశాలు మాత్రం మౌనంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేద. కానీ, చైనా మాత్రం అథ్లెట్ ఫొటోపై బ్రిటన్ న్యూస్ ఏజెన్సీపై తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం.

Also Read:

Tokyo Olympics 2020 Live: తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పీవీ సింధు; టెన్నిస్‌ డబుల్స్‌లో సానియాజోడీ ఓటమి

Tokyo Olympics 2020: ఆండీ ముర్రే ఔట్.. సింగిల్స్‌ నుంచి వైదొలిగిన బ్రిటన్ స్టార్ ప్లేయర్

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు