AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై భారత్ ఘన విజయం.. క్వార్టర్ ఫైనల్‌కు చేరువలో హాకీ టీం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు గ్రూఫ్‌ మ్యాచ్‌లో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-1 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో భారత హాకీ టీం క్వార్టర్ ఫైనల్‌కు మరింత చేరువైంది.

Tokyo Olympics 2020: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై భారత్ ఘన విజయం.. క్వార్టర్ ఫైనల్‌కు చేరువలో హాకీ టీం
Indian Hockey Team
Venkata Chari
|

Updated on: Jul 29, 2021 | 8:54 AM

Share

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు గ్రూఫ్‌ మ్యాచ్‌లో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-1 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో భారత హాకీ టీం క్వార్టర్ ఫైనల్‌కు మరింత చేరువైంది. అర్జెంటీనా తరపున కాసెల్లా స్కుత్‌ ఆట 48 వ నిమిషంలో గోల్‌ చేశాడు. తొలి భాగంలో భారత్ జట్టు వెనుకంజలో చేరింది. అనంతరం భారత జట్టు తరపున వి కుమార్‌, వీఎస్‌ ప్రసాద్‌, హర్మన్‌ప్రీత్‌సింగ్‌లు 43, 58, 59 వ నిమిషంలో గోల్స్‌ చేసి, భారత్ ఆధిక్యాన్ని పెంచేశారు. భారత జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. ఇప్పటికే మూడు విజయాలు సాధించిన భారత హాకీ జట్టు క్వార్టర్స్‌కు దాదాపుగా చేరినట్లే.

భారత్, అర్జెంటీనా టీంలు మొదటి రెండు క్వార్టర్స్‌లో గోల్ చేయకుండానే పోరును ముగించాయి. భారత ప్లేయర్లు మొదటి నుంచి దూకుడుగానే ఆడారు. అయితే, అర్జెంటీనా ఆటగాడు కెసెల్లా స్కూత్ 48వ నిమిషంలో గోల్ చేయడంతో భారత్ కొంత ఒత్తిడిలోకి వెళ్లింది. భారత జట్టు మొదటి రెండు క్వార్టర్లలో స్కోరు చేయలేకపోయింది.

మూడో క్వార్టర్‌లో భారత్ ఆధిక్యంలోకి మ్యాచ్ మూడో క్వార్టర్‌లో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. పెనాల్టీ కార్నర్‌ను 43 వ నిమిషంలో వరుణ్ కుమార్ గోల్‌గా మలిచాడు. అనంతరం 48 వ నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ కార్నర్ లభించింది. దానిపై కెసెల్లా ఒక గోల్ చేసి మ్యాచ్‌ను సమం చేశాడు. ఆ సమయంలో మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారోననే ఉత్కంఠ నెలకొంది. అర్జెంటీనాలోపాటు భారత్‌కు ఈ మ్యాచులో విజయం ఎంతో కీలకమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం సులవవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌పై 2 నిమిషాల్లో 2 గోల్స్ చేసి భారత్ ఈమ్యాచ్‌లో విజయం సాధించింది. వివేక్ 58 వ నిమిషంలో భారత్ తరఫున గోల్ చేయగా, 59 వ నిమిషంలో హర్మాన్ గోల్ సాధించాడు.

Also Read: Tokyo Olympics 2020: హ్యాట్రిక్‌ విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత స్టార్ షట్లర్.. డెన్మార్క్ ప్లేయర్‌పై 40 నిమిషాల్లోనే..

Tokyo Olympics 2020 Live: క్వార్టర్ ఫైనల్ చేరిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. అర్జెంటీనాపై భారత హాకీ టీం విజయం