AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్ భావోద్వేగ ట్వీట్.. రవిశాస్త్రికి పంచ్!

ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ ఓటమి తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విండీస్ పర్యటనకు బయల్దేరే ముందు విరాట్ కోహ్లీ అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. అంతేకాదు అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఊహాగానాలే అని ఖండించడమే కాదు.. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకుంటే టీమిండియా ప్రదర్శన అద్భుతమైన రీతిలో ఉండేది కాదని అన్నాడు. […]

రోహిత్ భావోద్వేగ ట్వీట్.. రవిశాస్త్రికి పంచ్!
Ravi Kiran
|

Updated on: Aug 01, 2019 | 3:55 AM

Share

ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ ఓటమి తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విండీస్ పర్యటనకు బయల్దేరే ముందు విరాట్ కోహ్లీ అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. అంతేకాదు అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఊహాగానాలే అని ఖండించడమే కాదు.. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకుంటే టీమిండియా ప్రదర్శన అద్భుతమైన రీతిలో ఉండేది కాదని అన్నాడు. ‘జట్టు కంటే ఎవరూ కూడా ముఖ్యం కాదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉండగా బుధవారం వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ట్వీట్ మాత్రం అందరిని ఆలోచనలో పడేసిందని చెప్పాలి. ‘జట్టు కోసమే కాదు.. దేశం కోసం పోరాడతా’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీనితో పాటు బ్యాటింగ్‌కు వస్తున్న ఫొటోను కూడా జత చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.