French Open 2021: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్.. సెమీస్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు..
స్టార్ షెట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్లో శుక్రవారం థాయ్లాండ్కు చెందిన బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్పై వరుస గేమ్లలో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది...

స్టార్ షెట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్లో శుక్రవారం థాయ్లాండ్కు చెందిన బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్పై వరుస గేమ్లలో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. మూడో సీడ్గా ఉన్న సింధు 38 నిమిషాల్లో ఎనిమిదో సీడ్పై 21-14 21-14 తేడాతో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో సయాకా తకహాషి (జపాన్)తో సింధు తలపడనుంది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన సింధు గురువారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లో 21-19, 21-9తో ప్రపంచ 24వ ర్యాంక్లో ఉన్న డెన్మార్క్కు చెందిన లైన్ క్రిస్టోఫర్సన్ను ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. సింధు, బుసానన్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. విరామం తర్వాత సింధు మరోసారి 16-10, 20-12లో నిలిచింది. పీవీ సింధు తొలి రౌండ్లో టర్కీకి చెందిన నెస్లిహాన్పై విజయం సాధించింది.
యువ కెరటం లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కొరియాకు చెందిన హియో క్వాంగీ చేతిలో 43 నిమిషాల్లో 17-21 15-21 తేడాతో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడి 21–18, 18–21, 17–21తో ఆరోన్ చియా–సో వుయ్యికి (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది.
Read Also.. T20 World Cup 2021: న్యూజిలాండ్తో ఆడే జట్టులో మార్పు లేదా!.. శార్దూల్ ఠాకూర్కు ఈసారి అవకాశం లేనట్టే..