AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెలరేగిన భారత మహిళా క్రికెటర్లు.. సిరీస్ సొంతం

ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్ సొంతం చేసుకుంది భారత మహిళల జట్టు. ఇంగ్లండ్ నిర్దేషించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించారు. తద్వారా ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది భారత్. స్మృతీ మంధాన 63, మిథాలీ రాజ్ 47, పూనమ్ రౌత్ 32లు రాణించి జట్టు ఘన విజయానికి తోడ్పడ్డారు. ఇంగ్లండ్ […]

చెలరేగిన భారత మహిళా క్రికెటర్లు.. సిరీస్ సొంతం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:20 PM

Share

ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్ సొంతం చేసుకుంది భారత మహిళల జట్టు. ఇంగ్లండ్ నిర్దేషించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించారు.

తద్వారా ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది భారత్. స్మృతీ మంధాన 63, మిథాలీ రాజ్ 47, పూనమ్ రౌత్ 32లు రాణించి జట్టు ఘన విజయానికి తోడ్పడ్డారు.

ఇంగ్లండ్ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే రోడ్రిగ్స్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత మంధాన- పూనత్‌రౌత్‌ల జోడి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు.

మూడో వికెట్‌కు మంధాన- మిథాలీ రాజ్‌ జోడి 66 పరుగులు జత చేయడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 43 ఓవర్లలో 161 రన్స్‌కే ఆలౌటైంది.

ఇంగ్లండ్ మహిళల్లో నటలీ స్కీవర్ 85 పరుగులు మినహా ఎవరూ రాణించకపోవడంతో.. ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. జులన్ గోస్వామి, శిఖా పాండేలు చెరో 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.