AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్ శర్మ ను అవమానించిన కోహ్లీ..!

విశాఖ: ఆసీస్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠం సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి చవి చూసింది. చివరి ఓవర్ లో ఆసీస్ 14 పరుగులు చేయాల్సి ఉండగా ఉమేష్ యాదవ్ కట్టడి చేయలేకపోయాడు. ఫలితంగా భారత్ పరాజయం పాలైంది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా […]

రోహిత్ శర్మ ను అవమానించిన కోహ్లీ..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:45 PM

Share

విశాఖ: ఆసీస్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠం సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి చవి చూసింది. చివరి ఓవర్ లో ఆసీస్ 14 పరుగులు చేయాల్సి ఉండగా ఉమేష్ యాదవ్ కట్టడి చేయలేకపోయాడు. ఫలితంగా భారత్ పరాజయం పాలైంది.

ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా బౌలింగ్ వేస్తుండగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ  అతడికి సూచనలు ఇచ్చేందుకు వచ్చారు. అయితే కోహ్లీ, బుమ్రా మాత్రమే మాట్లాడుకుని.. ప్రక్కనే ఉన్న రోహిత్ ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న రోహిత్ ని.. కోహ్లీ, బుమ్రా అవమానించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే రోహిత్ ని అవమానించడం కాదని.. అసలు రోహిత్ కు జట్టులో చోటివ్వడమే ఎక్కువని ట్వీట్ చేస్తున్నారట. కాపీ రైట్స్ కారణంగా దీనికి సంబంధించిన వీడియో డిలీట్ అవ్వగా.. ఆలోపే  నెటిజన్లు దీనిని షేర్ చేసేశారు.