Video: టీమిండియాకు మూడో షాక్.. గాయంతో మైదానం వీడిన మరో కీలక ప్లేయర్..

India vs New Zealand Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు టీమ్ ఇండియా టెన్షన్ పెరిగింది. జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ గాయపడ్డాడు. అదే సమయంలో రిషబ్ పంత్ కూడా గాయం కారణంగా మూడో రోజు మైదానంలోకి రాలేదు. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో వెనుకబడిన టీమిండియాకు ఇది పెద్ద దెబ్బ.

Video: టీమిండియాకు మూడో షాక్.. గాయంతో మైదానం వీడిన మరో కీలక ప్లేయర్..
Ind Vs Nz Test Jaiswal
Follow us

|

Updated on: Oct 18, 2024 | 12:32 PM

Yashasvi Jaiswal got injured: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అంతగా కలసిరాలేదు. తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దవగా, రెండో రోజు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది జరిగిన మరుసటి రోజే టీమ్ ఇండియాకు మరో భారీ షాక్ తగిలింది. భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇప్పుడు మూడో రోజు ఆట కూడా టీమ్ ఇండియాకు టెన్షన్ తగ్గలేదు. మరో టీం ఇండియా ఆటగాడు గాయపడ్డాడు.

పంత్ తర్వాత మైదానం వీడిన జైస్వాల్..

మూడో రోజు ఆటను అద్భుతంగా ప్రారంభించిన భారత బౌలర్లు ఆరంభంలోనే న్యూజిలాండ్‌కు భారీ షాక్‌లు అందించారు. ఈ రోజు తొలి వికెట్‌ మహ్మద్‌ సిరాజ్‌ పేరిట ఉంది. మహ్మద్ సిరాజ్ డారిల్ మిచెల్‌ను పెవిలియన్ చేర్చాడు. డారిల్ మిచెల్‌ను అవుట్ చేయడంలో యశస్వి జైస్వాల్ కూడా ముఖ్యమైన సహకారం అందించాడు. గల్లీలో అద్భుత క్యాచ్ పట్టాడు. ఇది చాలా వేగవంతమైన షాట్. దీనిని యశస్వి జైస్వాల్ క్యాచ్ చేయగలిగాడు. అయితే, ఈ క్రమంలో అతడి చేతికి గాయమైంది. దీంతో యశస్వి జైస్వాల్ స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగాల్సి వచ్చింది.

జైస్వాల్ క్యాచ్ వీడియో..

అయితే జైస్వాల్ గాయం ఎంత తీవ్రంగా ఉందో ఇంకా తెలియరాలేదు. జైస్వాల్ గాయం టీమ్ ఇండియాకు పెద్ద టెన్షన్. ఈ ఏడాది భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని ఇటీవలి ప్రదర్శన కూడా చాలా అద్భుతంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఇన్నింగ్స్‌కు అతని అవసరం చాలా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..