AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: శ్రీలంక చేతిలో ఓడితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ఆవిరవుతాయా? టీమిండియా ఫైనల్ ఈక్వేషన్స్ ఇవే

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ 2025-27 రేసులో టీమిండియా సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్.. ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే రాబోయే 9 టెస్టుల్లో ఎన్ని గెలవాలి? శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌ల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

WTC Final: శ్రీలంక చేతిలో ఓడితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ఆవిరవుతాయా? టీమిండియా ఫైనల్ ఈక్వేషన్స్ ఇవే
Team India (2)
Rakesh
|

Updated on: Aug 16, 2026 | 11:19 AM

Share

WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో భారత జట్టు పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఓడితే టీమిండియా ఫైనల్ ఆశలు ఆవిరవుతాయా అనే ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో భారత జట్టు 48.15 శాతం విజయాల రేటు (PTC)తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సైకిల్‌లో భారత్‌కు ఇంకా తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. అయితే తొలి టెస్టులో ఊహించని పరాజయం ఎదురైనా ఫైనల్ తలుపులు పూర్తిగా మూసుకుపోవు.

7 విజయాలు కచ్చితంగా ఉండాల్సిందే

మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 7 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే భారత్ ఫైనల్ రేసులో నిలబడగలదు. 7 మ్యాచ్‌లు గెలిస్తే పాయింట్ల శాతాన్ని 60 శాతానికి పైగా తీసుకెళ్లవచ్చు. సాధారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ అర్హత సాధించడానికి 60 శాతానికి పైగా పాయింట్లు తప్పనిసరి. అంతకంటే తక్కువ పాయింట్లు వస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి శ్రీలంకతో తొలి టెస్టు ఓడిపోయినా.. మిగిలిన 8 మ్యాచ్‌ల్లో కనీసం 7 గెలిస్తే ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.

రాబోయే తొమ్మిది టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే

టీమిండియా ముందున్న తొమ్మిది టెస్టుల ప్రయాణం అంత తేలికైనదేమీ కాదు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత అత్యంత కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎదురుచూస్తోంది. ఈ కఠినమైన షెడ్యూల్‌లో మెజారిటీ మ్యాచ్‌లు గెలవడం భారత జట్టుకు పెద్ద సవాలుగా మారనుంది.

శ్రీలంక సిరీస్ ఎందుకు అత్యంత కీలకం?

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లతో తలపడే ముందు శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడం భారత్‌కు చాలా ముఖ్యం. లంకపై 2-0 తేడాతో గెలిస్తే పాయింట్ల శాతం పెరగడమే కాకుండా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఒకవేళ ఇక్కడ పాయింట్లు కోల్పోతే ఆస్ట్రేలియా గడ్డపై గెలవాల్సిన ఒత్తిడి పెరిగిపోతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం భారత్‌కు అసాధ్యమేమీ కాదు కానీ ప్రయాణం మాత్రం అత్యంత క్లిష్టంగా మారింది. శ్రీలంకతో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా మిగిలిన సిరీస్‌లలో ప్రదర్శన ఆధారంగానే టీమిండియా భవితవ్యం తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us