AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Asia Cup 2024: పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

మహిళల ఆసియా కప్ 2024 రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక ఉత్కంఠ విజయం సాధించింది. శుక్రవారం (జులై 26) రాత్రి శ్రీలంకలోని దంబుల్లాలోని రాంగిరి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్‌పై శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Women’s Asia Cup 2024: పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
Sri Lanka Women Team
Basha Shek
|

Updated on: Jul 26, 2024 | 10:57 PM

Share

మహిళల ఆసియా కప్ 2024 రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక ఉత్కంఠ విజయం సాధించింది. శుక్రవారం (జులై 26) రాత్రి శ్రీలంకలోని దంబుల్లాలోని రాంగిరి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్‌పై శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్, శ్రీలంకకు 141 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ పరుగుల ఛేదనలో శ్రీలంక తడబడింది. మరోవైపు పాక్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో మ్యాచ్ చివరి ఓవర్‌కు చేరుకుంది. అయితే ఒక బంతి ఉండగానే శ్రీలంక గెలిచింది. శ్రీలంక 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. లంక తరుపున కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన చమరి అతపతు 63 పరుగులు చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది.ఈ ఓటమితో ఆసియా కప్ లో పాక్ ప్రయాణం ముగిసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు గుల్ ఫిరోజా, మునీబా అలీ తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని బద్దలు కొట్టడంతో పాటు నిర్ణీత వ్యవధిలో ఆ జట్టు వికెట్లు కోల్పోతూ వచ్చింది. శ్రీలంక కూడా ఎక్కువ పరుగులు ఇవ్వకపోవడంతో పాక్ జట్టు భారీ స్కోరు నమోదు చేయకుండా అడ్డుకుంది. పాకిస్థాన్ తరఫున గుల్ ఫిరోజా 25 పరుగులు చేయగా, మునీబా అలీ 37 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. సిద్రా అమీన్ 10 పరుగులకే ఇన్నింగ్స్ ముగించగా, కెప్టెన్ నిదా దార్ 23 పరుగులు చేశాడు. ఆఖర్లో అలియా రియాజ్ అజేయంగా 16 పరుగులు, ఫాతిమా సనా 23 పరుగులు చేసి జట్టును గౌరవప్రదమైన స్కోరు అందించారు.

ఈ లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక జట్టుకు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్ మూడో బంతికే విష్మి గుణరత్నే వికెట్ కోల్పోయింది. హర్షిత సమరవిక్రమ ఇన్నింగ్స్ కూడా 12 పరుగులకే ముగిసింది. కవిషా దిల్హరి కూడా 17 పరుగులకే పెవిలియన్ చేరింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో ధీటైన పోరాటం చేసిన లంక కెప్టెన్‌ చమరి అతపతు 63 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. అయితే చమరి అవుటైన తర్వాత పాకిస్థాన్ మళ్లీ మ్యాచ్‌పై పట్టు సాధించింది. కానీ 19వ ఓవర్లో ఇచ్చిన 13 పరుగులు పాక్ పరాజయాన్ని ఖరారు చేశాయి. ఇది మాత్రమే కాకుండా మొత్తం మ్యాచ్‌లో పాక్ జట్టు పేలవమైన ఫీల్డింగ్, నో బాల్‌లు ఓటమికి ప్రధాన కారణం.

ఇవి కూడా చదవండి

శ్రీలంక మహిళల ప్లేయింగ్ ఎలెవన్:

చమరి అతపతు (కెప్టెన్), విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, హాసిని పెరీరా, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, ఇనోషి ప్రియదర్శిని, ఉదేశిక ప్రబోధని, సుగంధిక కులస్ కుమారి, సుగంధిక కులస్ కుమారి.

పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:

నిదా దార్ (కెప్టెన్), గుల్ ఫిరోజా, మునిబా అలీ (వికెట్ కీపర్), సిద్రా అమీన్, ఒమామా సోహైల్, అలియా రియాజ్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..