AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WCL 2024: టీమిండియా దిగ్గజాల పేలవ ప్రదర్శన.. 68 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం..

World Championship of Legends 2024: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా అది హై వోల్టేజీగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినడంతో.. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ జట్లు ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే పోటీపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ ముగిసింది.

WCL 2024: టీమిండియా దిగ్గజాల పేలవ ప్రదర్శన.. 68 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం..
Pak C Thrash Ind C By 68 Runs
Venkata Chari
|

Updated on: Jul 07, 2024 | 12:33 PM

Share

World Championship of Legends 2024: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా అది హై వోల్టేజీగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినడంతో.. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ జట్లు ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే పోటీపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ ముగిసింది. భారత్‌ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ పరిస్థితి దారుణంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాజీ ఆటగాళ్ల మధ్య పోటీ జరిగింది. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్‌లో ఇరు దేశాల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్స్ అద్భుతమైన ఆటతో భారత బౌలర్లను చిత్తు చేశారు. ఫలితంగా పాకిస్థాన్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్, షర్జీల్ ఖాన్ వేగంగా పరుగులు చేయడం ప్రారంభించారు. దీంతో పవర్‌ప్లేలో 68 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

ఒక్క ఓవర్లో 25 పరుగులు ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్..

లెఫ్ట్ ఆర్మ్ పేస్, రైట్ ఆర్మ్ పేస్, స్పిన్ రెండూ టీమిండియాకు పని చేయలేకపోయాయి. పాక్ బ్యాట్స్‌మెన్స్ భారత బౌలర్లను తుక్కుగా కొట్టి పడేశారు. షర్జీల్ ప్రతి బౌలర్‌పై దాడి చేయాలనుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాట్స్‌మెన్ కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. కాగా, కమ్రాన్ అక్మల్ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ బ్యాట్స్‌మెన్ ఇర్ఫాన్ పఠాన్ వేసిన ఒక ఓవర్‌లో మొత్తం 25 పరుగులు చేశాడు.

జట్టు ఓవర్‌కు 10 పరుగుల అత్యధిక రన్ రేట్‌తో పరుగులు చేస్తోంది. పాక్ ఛాంపియన్స్ 10 ఓవర్లలో 132 పరుగులు చేసింది. అయితే, ఓపెనర్లిద్దరినీ అవుట్ చేయడంతో పవన్ నేగి, అనురీత్ సింగ్ స్కోరు కార్డుకు చెక్ పెట్టారు. కానీ, క్రీజులోకి వచ్చిన షోయబ్ మసూద్ కూడా వేగంగా ఆడడంతో పాకిస్థాన్ 16వ ఓవర్‌లోనే 200 పరుగుల మార్కును దాటేసింది. మక్సూద్ 24 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టును 250 పరుగులకు చేరువగా తీసుకెళ్లాడు.

చివరి రెండు ఓవర్లలో అనురీత్ సింగ్, ధావల్ కులకర్ణిలు పాకిస్థాన్‌ జట్టును 244 పరుగులకే పరిమితం చేశారు. భారత బౌలర్లలో ఆర్పీ సింగ్, అనురీత్ సింగ్, ధవల్, పవన్ నేగిలకు తలో వికెట్ దక్కింది.

రైనా మాత్రమే ఫిఫ్టీ కొట్టాడు..

లక్ష్యాన్ని ఛేదించే సమయంలో భారత ఛాంపియన్స్‌కు రాబిన్ ఉతప్ప అద్భుతమైన ప్రారంభాన్ని అందించాడు. అయితే, అతను 12 బంతుల వరకు మాత్రమే నిలవగలిగాడు. అనంతరం అంబటి రాయుడు 23 బంతుల్లో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ, సురేశ్ రైనా అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, అవతలి ఎండ్ నుంచి వికెట్లు పడటం వలన భారత ఛాంపియన్స్ జట్టు 68 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఖాతా తెరవకుండానే యూసుఫ్ పఠాన్ ఔటయ్యాడు. యువరాజ్ సింగ్ 14 పరుగులు చేశాడు. కాగా ఇర్ఫాన్ పఠాన్ 15 పరుగులు చేశాడు. కెప్టెన్ హర్భజన్ సింగ్ 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు. పాకిస్థాన్ బౌలింగ్‌లో షోయబ్ మాలిక్, వాహబ్ రియాజ్ అద్భుత ప్రదర్శన చేసి తలో 3 వికెట్లు తీశారు. భారత్‌కు ఇదే తొలి ఓటమి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..