AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా ఫ్యూచర్ అన్నారు.. కట్‌చేస్తే.. జట్టులో చోటుకోసం పడిగాపులు.. గంభీర్ కూడా దూరం పెట్టేశాడుగా

Ishan Kishan IND VS SL Squad: శ్రీలంకతో T20, ODI సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. వన్డే ఫార్మాట్‌కు ఎంపికయ్యాడు. గతేడాది ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అయ్యర్‌ను జట్టు నుంచి తప్పించారు. దేశవాళీ క్రికెట్‌కు దూరం పాటించినందుకు అతడిపై చర్యలు తీసుకున్నారు. ఆయనకు సెంట్రల్ కాంట్రాక్టు కూడా ఇవ్వలేదు.

Team India: టీమిండియా ఫ్యూచర్ అన్నారు.. కట్‌చేస్తే.. జట్టులో చోటుకోసం పడిగాపులు.. గంభీర్ కూడా దూరం పెట్టేశాడుగా
Ishan Kisan
Venkata Chari
|

Updated on: Jul 19, 2024 | 8:31 PM

Share

Ishan Kishan IND VS SL Squad: శ్రీలంకతో T20, ODI సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. వన్డే ఫార్మాట్‌కు ఎంపికయ్యాడు. గతేడాది ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అయ్యర్‌ను జట్టు నుంచి తప్పించారు. దేశవాళీ క్రికెట్‌కు దూరం పాటించినందుకు అతడిపై చర్యలు తీసుకున్నారు. ఆయనకు సెంట్రల్ కాంట్రాక్టు కూడా ఇవ్వలేదు. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అయ్యర్ ODI జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ, కిషన్‌ను మళ్లీ పట్టించుకోలేదు.

8 నెలల పాటు భారత్ తరపున ఆడని ఇషాన్..

గౌతమ్ గంభీర్ కోచ్‌గా మారిన వెంటనే శ్రేయాస్ అయ్యర్‌కి మంచి రోజులు వచ్చాయి. తన కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌ని గెలిపించాడు. మరోవైపు, ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం వేరేలా జరుగుతోంది. సెలక్టర్ల రాడార్‌లో అతను ఎక్కడా లేడని తెలుస్తోంది. ఇషాన్ చివరిసారిగా నవంబర్ 2023లో భారత్ తరపున ఆడాడు. గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో అలసట కారణంగా ఇషాన్ విరామం కోరాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో, కిషన్ బరోడాలో హార్దిక్ పాండ్యాతో శిక్షణ పొందాడు. అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కోసం ఆడటానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చే దేశవాళీ సీజన్ తర్వాతే కిషన్ తిరిగి వచ్చే అవకాశం పెరిగింది. ఐపీఎల్‌లో మాత్రమే ఆడడం అతనికి హానికరమని ఇప్పటికే అర్థమైంది.

దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత..

రాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ 2024-25లో ఆటగాళ్ల లభ్యత, భాగస్వామ్యాన్ని బోర్డు పర్యవేక్షిస్తూనే ఉంటుందని BCCI మీడియా ప్రకటనలో తెలిపింది. గత ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో ఏడు అర్ధ సెంచరీలు సాధించిన అసోం ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుత ప్రదర్శనతో లాభపడ్డాడు. దేశవాళీ క్రికెట్ ప్రదర్శనకు జాతీయ సెలక్షన్ కమిటీ పూర్తి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ మళ్లీ తానేంటో నిరూపించుకోవాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..