AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC: ఐసీసీకి చేరిన అడిలైడ్ గొడవ.. ట్రావిస్ హెడ్‌కు ఊరట, సిరాజ్‌పై సీరియస్.. ఎలాంటి శిక్ష విధించిందంటే?

Mohammed Siraj vs Travis Head: అడిలైడ్‌లో జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ మధ్య ఘర్షణ జరిగింది. సిరాజ్‌పై ట్రావిస్ హెడ్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఆ తర్వాత భారత పేసర్ అతనిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దిరమధ్య గొడవ జరిగింది.

ICC: ఐసీసీకి చేరిన అడిలైడ్ గొడవ.. ట్రావిస్ హెడ్‌కు ఊరట, సిరాజ్‌పై సీరియస్.. ఎలాంటి శిక్ష విధించిందంటే?
Mohammed Siraj And Travis H
Venkata Chari
|

Updated on: Dec 10, 2024 | 7:26 AM

Share

Mohammed Siraj vs Travis Head: అడిలైడ్ టెస్టులో గొడవపడిన మహ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి చర్యలు తీసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజున, భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ హెడ్‌ని అవుట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరి ఈ చర్య తర్వాత, మ్యాచ్ రిఫరీ చర్య తీసుకున్నారు. అయితే, ఐసీసీ భారత పేసర్‌కు మాత్రమే జరిమానా విధించగా, హెడ్‌కు కేవలం డీమెరిట్ పాయింట్లు మాత్రమే ఇచ్చారు.

అడిలైడ్ ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరిగింది. శనివారం, డిసెంబర్ 7, మ్యాచ్ రెండవ రోజు, ఆస్ట్రేలియా జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది. ట్రావిస్ హెడ్ తుఫాన్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లపై ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ విపరీతంగా దాడి చేయడంతో మహ్మద్ సిరాజ్ కూడా దెబ్బ తిన్నాడు. సిరాజ్ వేసిన ఒక ఓవర్‌లో హెడ్ ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. అయితే, అదే ఓవర్‌లో సిరాజ్ అద్భుతమైన బంతితో హెడ్‌ను బౌల్డ్ చేశాడు.

ఇక్కడే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వికెట్ పడిన వెంటనే సిరాజ్ గట్టిగా అరవడం, కోపంతో సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో ట్రావిస్ హెడ్ సిరాజ్‌తో ఏదో అన్నాడు. దానికి సమాధానంగా సిరాజ్ పెవిలియన్‌కు వెళ్లమని తన చేతితో సంకేతం చేశాడు. ఇది హెడ్‌కు నచ్చకపోవడంతో సిరాజ్‌తో మళ్లీ ఏదో అన్నాడు. ఆ తర్వాత, మ్యాచ్ ముగిసే వరకు ఇదే సమస్య కొనసాగింది. రెండు వైపుల నుంచి ప్రకటనలు వచ్చాయి. ఈ సంఘటనతో వారిద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందని భావించారు. చివరకు ఇదే జరిగింది.

ఇవి కూడా చదవండి

డిసెంబర్ 9 సోమవారం, మ్యాచ్ ముగిసిన ఒక రోజు తర్వాత, ఐసీసీ ఇద్దరు ఆటగాళ్లకు శిక్షను ప్రకటించింది. ప్రవర్తనా నియమావళిలోని వేర్వేరు కథనాల ప్రకారం ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లె దోషులుగా నిర్ధారించారు. ఇద్దరూ తమ తప్పును అంగీకరించారని ఐసిసి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఔట్ అయిన బ్యాట్స్‌మన్‌ను రెచ్చగొట్టే భాష, సంజ్ఞ లేదా చర్యకు సంబంధించిన ఆర్టికల్ 2.5ని ఉల్లంఘించినందుకు సిరాజ్ దోషిగా తేలాడు. దీని కింద సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. దీంతో పాటు అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా వచ్చింది.

ఆశ్చర్యకరంగా, హెడ్ మ్యాచ్ ఫీజు మినహాయించబడలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఆటగాడు, సపోర్టు స్టాఫ్, అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ పట్ల అనుచిత పదజాలంతో వ్యవహరించే ఆర్టికల్ 2.13 ప్రకారం అతను దోషిగా తేలాడు. శిక్షగా, హెడ్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే జోడించారు. గత 24 నెలల్లో ఇద్దరు ఆటగాళ్లకు ఇదే తొలి డీమెరిట్ పాయింట్. దీంతో సిరాజ్‌కు అన్యాయం జరిగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..