Team India: బుమ్రా స్థానంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్న షమీ.. హైదరాబాద్ ప్లేయర్ కూడా..

T20 World Cup 2022: ఆస్ట్రేలియా పిచ్ సీమ్‌లు, బౌన్స్‌ల కారణంగా షమీపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి షమీ అక్కడ బాగా బౌలింగ్ చేయగలడని బీసీసీఐ భావిస్తోంది. దీంతో పాటు సిరాజ్ కంటే..

Team India: బుమ్రా స్థానంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్న షమీ.. హైదరాబాద్ ప్లేయర్ కూడా..
Team India
Follow us

|

Updated on: Oct 10, 2022 | 8:13 PM

టీ20 ప్రపంచకప్ కోసం జస్ప్రీత్ బుమ్రా మినహా మొత్తం జట్టు ఆస్ట్రేలియాకు చేరుకుంది. వెన్ను గాయం కారణంగా దూరమైన జస్ప్రీత్ స్థానంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లలో ఒకరిని చేర్చవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, షమీపై ఎక్కువ ఆశలు ఉన్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు వెళ్లనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. బుమ్రా స్థానంలో ఎవరు? దీనిపై, బీసీసీఐ అధికారి మాట్లాడుతూ ‘ప్రపంచ కప్‌లో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ వస్తున్నట్లు పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షమీని NCA (నేషనల్ క్రికెట్ అకాడమీ)కి పంపనున్నట్లు, అక్కడ ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే, ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా పిచ్ సీమ్‌లు, బౌన్స్‌ల కారణంగా షమీపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి షమీ అక్కడ బాగా బౌలింగ్ చేయగలడని బీసీసీఐ భావిస్తోంది. దీంతో పాటు సిరాజ్ కంటే అనుభవజ్ఞుడిగా షమీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

సిరాజ్ కూడా..

ఇవి కూడా చదవండి

మహ్మద్ షమీతో పాటు మహ్మద్ సిరాజ్ కూడా ప్రపంచకప్‌లో జట్టులో భాగం కానున్నాడు. అతను రిజర్వ్ ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో అతడిపై పరుగులు చేయడం బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా మారుతోంది. అదే సమయంలో, దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, ప్రపంచ కప్‌లో ఫాస్ట్ బౌలర్ గాయపడినట్లయితే, సిరాజ్ ఉత్తమ ఎంపికగా భావిస్తున్నారు.

బుమ్రా లేకపోవడంతో బలహీనంగా పేస్ బౌలింగ్..

బుమ్రా లేకపోవడం ప్రపంచకప్‌లో టీమిండియాకు భారీ లోటుగా మారనుంది. టీ20 ప్రపంచకప్‌ 2022కు జట్టును ప్రకటించిన తర్వాత, టీమ్ ఇండియాలో టెన్షన్ నిరంతరం పెరుగుతోంది. మొదట రవీంద్ర జడేజా గాయం కారణంగా ప్రపంచ కప్‌నకు దూరమయ్యాడు. జట్టులో చేరలేదు. ఆపై దీపక్ హుడా కూడా ఇటీవల గాయపడ్డాడు. దీని కారణంగా అతను దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ప్రపంచకప్‌లో భారత్ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆసియా కప్‌లోనే డెత్ ఓవర్లలో చాలా పేలవంగా టీమిండియా బౌలింగ్ చేసింది. భారత జట్టు అనుభవజ్ఞుడైన బౌలర్ భువనేశ్వర్ కుమార్ 18, 19వ ఓవర్లలో చాలా ఖరీదైనవాడిగా నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా రాకతో జట్టుకు ఈ సమస్య తీరిపోతుందని అంతా భావించినా.. గాయం కారణంగా ఈ స్టార్ ప్లేయర్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అటువంటి పరిస్థితిలో షమీ అనుభవం ఉపయోగపడుతుంది.

2021 తర్వాత టీ20 మ్యాచ్‌లు ఆడని షమీ..

మహ్మద్ షమీ గత ఏడాది T20 ప్రపంచకప్ సందర్భంగా నమీబియాతో T20 ఫార్మాట్‌లో చివరిగా ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఈ ఆటగాడు అద్భుత ప్రదర్శన చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చి గెలుపొందాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ , అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.

రిజర్వ్ ఆటగాళ్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.