AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Super 8 : టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి? గ్రూప్-1లో ఆసక్తికరంగా మారిన ఈక్వేషన్స్

T20 World Cup Super 8 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరు క్లైమాక్స్ దశకు చేరుకుంది. గ్రూప్-1లో భారత జట్టు పరిస్థితి ప్రస్తుతం చావోరేవో అన్నట్టుగా మారింది. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో, టీమిండియా సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.

T20 World Cup Super 8 : టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి? గ్రూప్-1లో ఆసక్తికరంగా మారిన ఈక్వేషన్స్
T20 World Cup Super 8
Rakesh
|

Updated on: Feb 26, 2026 | 1:38 PM

Share

T20 World Cup Super 8 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరు క్లైమాక్స్ దశకు చేరుకుంది. గ్రూప్-1లో భారత జట్టు పరిస్థితి ప్రస్తుతం చావోరేవో అన్నట్టుగా మారింది. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో, టీమిండియా సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుత ఈక్వేషన్స్ ప్రకారం భారత్ సెమీఫైనల్ చేరాలంటే ఏం జరగాలో వివరంగా తెలుసుకుందాం.

భారత్ గ్రూపులో తాజా పరిస్థితి ఏంటి?

గ్రూప్-1లో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.

వెస్టిండీస్: జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయంతో +5.350 నెట్ రన్ రేట్‎తో అగ్రస్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికా: భారత్‌పై 76 పరుగుల విజయంతో +3.800 NRRతో రెండో స్థానంలో ఉంది.

భారత్: మొదటి ఓటమితో పాయింట్లు లేకుండా -3.800 NRRతో మూడో స్థానంలో ఉంది.

జింబాబ్వే: -5.350 NRRతో చివరి స్థానంలో నిలిచింది.

జింబాబ్వేపై ఓడినా భారత్ సెమీస్ వెళ్లవచ్చా?

అవును, ఇది లెక్కల పరంగా సాధ్యమే కానీ చాలా కష్టం. ఒకవేళ భారత్ నేడు జింబాబ్వే చేతిలో ఓడిపోయినా.. కింద పేర్కొన్న పరిస్థితులు జరిగితే అవకాశం ఉంటుంది.

సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌ను, ఆ తర్వాత జింబాబ్వేను కూడా ఓడించాలి.

అదే సమయంలో మార్చి 1న జరిగే మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా వెస్టిండీస్‌ను భారీ తేడాతో ఓడించాలి.

అప్పుడు సౌతాఫ్రికా 6 పాయింట్లతో నేరుగా క్వాలిఫై అవుతుంది. మిగిలిన మూడు జట్లు (భారత్, విండీస్, జింబాబ్వే) చెరో 2 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు ఎవరి రన్ రేట్ బాగుంటే వారు రెండో టీమ్‌గా సెమీస్‌కు వెళ్తారు.

వెస్టిండీస్ గెలిస్తే భారత్ పరిస్థితి ఏంటి?

ఒకవేళ వెస్టిండీస్ గనుక సౌతాఫ్రికాను ఓడించి, అదే రోజు భారత్ జింబాబ్వే చేతిలో ఓడిపోతే.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ఎందుకంటే అప్పుడు వెస్టిండీస్ 4 పాయింట్లతో ఉంటుంది, భారత్ చివరి మ్యాచ్ గెలిచినా కేవలం 2 పాయింట్లకే పరిమితమవుతుంది. ఒకవేళ విండీస్ గెలిచి, భారత్ కూడా గెలిస్తే అప్పుడు మూడు జట్లు (IND, SA, WI) 4 పాయింట్లతో నిలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది.

మూడు జట్లు సమాన పాయింట్లతో నిలిస్తే..?

ఒక ఆసక్తికరమైన ఈక్వేషన్ల ప్రకారం.. వెస్టిండీస్ సౌతాఫ్రికాను ఓడించి, భారత్ జింబాబ్వేను ఓడించి, ఆ తర్వాత సౌతాఫ్రికా జింబాబ్వేను ఓడించి, భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సౌతాఫ్రికా, భారత్, వెస్టిండీస్ మూడు జట్లు చెరో 4 పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు టాప్-2లో ఉన్న జట్లు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్‌కు చేరుతాయి. భారత్ రన్ రేట్ ప్రస్తుతం మరీ తక్కువగా ఉంది కాబట్టి, రాబోయే రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవడం చాలా ముఖ్యం.

భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందా?

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలంటే ముందుగా సెమీస్ గండం గడవాలి. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సేనకు ఉన్న ఏకైక మార్గం.. జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు సాధించి పాయింట్లతో పాటు రన్ రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవడం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us