లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ.. కేంద్రం తీరుపై రాహుల్గాంధీ తీవ్ర విమర్శలు
పేపర్ లీక్పై ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలియాలంటే బీజేపీ ఎంపీలు వారి పిల్లలను అడగాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్పై విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారని అన్ని పార్టీలు విద్యార్థులు ఆందోళనను గౌరవించాలన్నారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని అది భావప్రకటన స్వేచ్ఛని రాహుల్ గాంధీ కేంద్రాన్ని దుయ్యబట్టారు.
యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ మాట్లాడుతున్నారు.ఈ సందర్భంగా కేంద్రం తీరుపై రాహుల్ విమర్శలు గుప్పించారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారని.. వారిని కేంద్రం అర్థం చేసుకోలేదన్నారు. అన్ని పార్టీలు విద్యార్థుల సమస్యలు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థుల ఆందోళలను బీజేపీ నేతల పిల్లలు కూడా సమర్థించినట్లు చెప్పుకొచ్చారు. విద్యారంగం ఇప్పుడు ఖరీదైన వ్యాపారంగా మారిందని.. పేదలు విద్యకు దూరమవుతున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమంటున్నారో లైవ్లో చూడండి.
Published on: Jul 29, 2026 01:22 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఎవరెస్ట్ కరిగిపోతోంది.. కారణం ఇదే!
డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది
కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్తో పనిలేదు డ్యూడ్!
అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!

