AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: మరికొద్దిసేపట్లో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్.. భారత్-పాక్ మ్యాచ్‌పైనే అందరిచూపు.. ఎప్పుడంటే?

T20 World Cup 2024 Schedule: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య జూన్ 9న మ్యాచ్ జరగనుంది. టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్ అమెరికాతో జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జూన్ 12న జరగనుంది. భారత జట్టు తన మూడు మ్యాచ్‌లను న్యూయార్క్‌లో ఆడే అవకాశం ఉంది. భారత జట్టు శ్రీలంక, ఆస్ట్రేలియాతో కూడా మ్యాచ్‌లు ఆడనుంది.

T20 World Cup 2024: మరికొద్దిసేపట్లో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్.. భారత్-పాక్ మ్యాచ్‌పైనే అందరిచూపు.. ఎప్పుడంటే?
Icc T20 World Cup
Venkata Chari
|

Updated on: Jan 05, 2024 | 3:46 PM

Share

T20 World Cup 2024 Schedule: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి టోర్నీని వెస్టిండీస్, యూఎస్‌లో నిర్వహించనున్నారు. ఐసీసీ తన షెడ్యూల్‌ను శుక్రవారం నాడు ప్రకటించనుంది. ఇప్పటికే వచ్చిన నివేదికల ప్రకారం, భారత్ తన మొదటి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఉండొచ్చని తెలుస్తోంది. టీమ్‌ ఇండియా గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకోగలదని భావిస్తున్నారు. భారత్, పాకిస్థాన్‌లతో పాటు ఐర్లాండ్‌ జట్టుతోపాటు అమెరికా కూడా ఉంటుంది. జూన్ 5న టీమ్ ఇండియా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య జూన్ 9న మ్యాచ్ జరగనుంది. టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్ అమెరికాతో జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జూన్ 12న జరగనుంది. భారత జట్టు తన మూడు మ్యాచ్‌లను న్యూయార్క్‌లో ఆడే అవకాశం ఉంది. భారత జట్టు శ్రీలంక, ఆస్ట్రేలియాతో కూడా మ్యాచ్‌లు ఆడనుంది. ఐసీసీ శుక్రవారం రాత్రి 7 గంటలకు టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించనుంది. దీనికి సంబంధించి Xలో స్టార్ స్పోర్ట్స్ ఓ ట్వీట్ షేర్ చేసింది.

స్టార్ స్పోర్ట్స్ ట్వీట్..

టీ20 ప్రపంచకప్ 2024లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత్ తరపున ఆడగలరని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా కాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారు తిరిగి రావచ్చని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును నేడు ప్రకటించనుంది. మీడియా కథనాల ప్రకారం, రోహిత్, విరాట్ టీ20కి కూడా అందుబాటులో ఉంటారని బోర్డుకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల వీరిద్దరూ తిరిగి టీమ్ ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..