AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ఫైనల్ మ్యాచ్‌ నుంచి ఆల్ రౌండర్‌ ఔట్?

IND vs SA, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, భారత్ రెండూ అజేయంగా నిలిచాయి. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో విజేత ఎవరనేది ఉత్కంఠ కలిగిస్తోంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసిన భారత జట్టు సగర్వంగా ఫైనల్ పోరులోకి అడుగుపెట్టింది.

IND vs SA: టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ఫైనల్ మ్యాచ్‌ నుంచి ఆల్ రౌండర్‌ ఔట్?
Team India
Venkata Chari
|

Updated on: Jun 29, 2024 | 8:24 AM

Share

IND vs SA, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, భారత్ రెండూ అజేయంగా నిలిచాయి. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో విజేత ఎవరనేది ఉత్కంఠ కలిగిస్తోంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసిన భారత జట్టు సగర్వంగా ఫైనల్ పోరులోకి అడుగుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రోహిత్ సేన పటిష్టమైన ప్లేయింగ్ ఎలెవన్, సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.

కరీబియన్ దేశాల పిచ్‌లను బట్టి భారత జట్టు కూర్పు ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరింది. కరీబియన్‌లోని స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపై కుల్దీప్ యాదవ్‌ను ట్రంప్ కార్డ్‌గా ఉపయోగించనున్న రోహిత్, న్యూయార్క్‌లోని ఫాస్ట్-ఫ్రెండ్లీ పిచ్‌లపై ముగ్గురు నిపుణులైన పేసర్‌లను రంగంలోకి దిగనున్నాడు.

కోహ్లీ-దూబేపై అంచనాలు..

గత మ్యాచ్‌లో ఆడిన పదకొండు మందినే ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దింపడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇద్దరు ఆటగాళ్ల నుంచి జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు టోర్నీలో రాణించలేకపోయాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో కోహ్లీ, రోహిత్‌ల చివరి మ్యాచ్ ఇదే కావచ్చని కూడా చెబుతున్నారు. అయితే కోహ్లీలా కాకుండా రోహిత్ టోర్నీలో నిర్భయంగా, అనర్గళంగా బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాబట్టి రోహిత్ బ్యాటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. అయితే చివరి మ్యాచ్‌లోనైనా కోహ్లి బ్యాట్ మెరవాలని అంతా కోరుకుంటున్నారు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా ఆశించిన రీతిలో రాణించాల్సి ఉంది.

జట్టులో ఎలాంటి మార్పు లేదు..

మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా సమర్ధవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు తమ పాత్రను చక్కగా నిర్వహిస్తున్నందున బౌలింగ్ విభాగంలో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ ముగిసిన వెంటనే ఇక్కడకు చేరుకున్న భారత జట్టు.. విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి కేవలం ఒక రోజు సమయమే దొరికింది. అయితే, ఈ మైదానంలో ఇప్పటికే ఒక మ్యాచ్‌ ఆడిన భారత జట్టుకు పిచ్‌తో పరిచయం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, జప్రీత్ బుమ్రా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..