AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: న్యూయార్క్‌లో కమ్ముకున్న మేఘాలు.. మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే పాక్ ఆశలు గల్లంతే..

IND vs PAK, Weather Report: ఇంకొన్ని గంటల్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ 2024 అతిపెద్ద మ్యాచ్‌కు ముందు వాతావరణం భయపెడుతోంది. తాజా సమాచారం ప్రకారం న్యూయార్క్‌లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ప్రేక్షకులు న్యూయార్క్‌లోని కొత్త గ్రౌండ్ నుంచి వీడియోలు, ఫొటోలను నిరంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

IND vs PAK: న్యూయార్క్‌లో కమ్ముకున్న మేఘాలు.. మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే పాక్ ఆశలు గల్లంతే..
T20 Wc 2024 Ind Vs Pak New York Stadium
Venkata Chari
|

Updated on: Jun 09, 2024 | 6:32 PM

Share

IND vs PAK, Weather Report: ఇంకొన్ని గంటల్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ 2024 అతిపెద్ద మ్యాచ్‌కు ముందు వాతావరణం భయపెడుతోంది. తాజా సమాచారం ప్రకారం న్యూయార్క్‌లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ప్రేక్షకులు న్యూయార్క్‌లోని కొత్త గ్రౌండ్ నుంచి వీడియోలు, ఫొటోలను నిరంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, మ్యాచ్ సమయంలో దట్టమైన చీకటి మేఘాలు నిరంతరం కనిపిస్తాయి. కానీ వర్షం కురిసే సూచన లేదు.

IND-PAK మ్యాచ్‌లో వర్షం పడవచ్చు..

అక్యూవెదర్ ప్రకారం, మ్యాచ్ 10:30 గంటలకు ప్రారంభం కాగా, న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 8, 9 గంటలకు వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్‌ మొదట్లో వర్షం పడే అవకాశం 40 శాతం ఉంది. ఆ తర్వాత ఎండ కాస్తుందని వెదర్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. దీంతో ప్రేక్షకులు పూర్తి మ్యాచ్‌ని వీక్షించనున్నారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడి, ఈ మ్యాచ్ రద్దు చేస్తే, అప్పుడు పాకిస్తాన్ జట్టు భారీ నష్టాన్ని చవిచూడవచ్చు. అలాగే టీమ్ ఇండియా కూడా 1 పాయింట్‌తో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కురిసినా మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ని చూడాలని ఇరు జట్ల ఆటగాళ్లు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

భారత్-పాకిస్థాన్ పిచ్ ప్రమాదకరం..!

టోర్నీలో 16వ మ్యాచ్ నెదర్లాండ్స్, సౌతాఫ్రికా మధ్య జరిగిన పిచ్‌పైనే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 103/9 మాత్రమే చేసింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా కేవలం 12 పరుగులకే మొదటి 4 వికెట్లు కోల్పోయింది. కానీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్‌ల పోరాట ఇన్నింగ్స్‌తో ప్రోటీస్ 1.1 ఓవర్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు అదే పిచ్‌పై మళ్లీ టీమ్‌ఇండియా, పాక్‌ జట్లు పోటీపడడం చూస్తుంటే స్కోరు 100లోపే ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 3 నెలల్లో తాత్కాలికంగా నిర్మించారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరం నుంచి తయారు చేసిన నాలుగు డ్రాప్ పిచ్‌లు ఇక్కడ ఉపయోగించారు. అయితే ఇప్పటి వరకు ఈ పిచ్‌లపై ఆడిన అన్ని జట్ల బ్యాట్స్‌మెన్లు తడబడుతూ కనిపించడం విశేషం.