AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Cricket: ఇదేం మ్యాచ్‌ భయ్యా.. 18 బంతుల్లోనే విక్టరీ.. ప్రత్యర్థి టీం స్కోర్లు చూస్తే పరేషానే

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఈ మ్యాచ్‌లో ఒక జట్టు 9.1 ఓవర్లు మాత్రమే ఆడి 32 పరుగులకే ఆలౌట్ అయింది. అదే సమయంలో మరో జట్టు కేవలం 18 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి భారీ రికార్డు సృష్టించింది.

T20 Cricket: ఇదేం మ్యాచ్‌ భయ్యా.. 18 బంతుల్లోనే విక్టరీ.. ప్రత్యర్థి టీం స్కోర్లు చూస్తే పరేషానే
Syed Mushtaq Ali Trophy
Venkata Chari
|

Updated on: Nov 27, 2024 | 8:28 PM

Share

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతోంది. 38 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఈ టోర్నీలో ఎన్నో అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లను అభిమానులు చూస్తున్నారు. కానీ, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అందుకు విరుద్ధంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో, ఇరు జట్లు కలిసి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయాయి. ఈ సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతిపెద్ద విజయం రికార్డ్ కూడా బద్దలైంది.

32 పరుగులకే కుప్పకూలిన జట్టు..

ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీలో అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో, అరుణాచల్ ప్రదేశ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇది పూర్తిగా తప్పు అని నిరూపితమైంది. ఈ సమయంలో, అరుణాచల్ ప్రదేశ్ జట్టు 9.1 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. 32 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ జట్టులోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును తాకలేకపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పూజారి అత్యధికంగా 5 అజేయంగా పరుగులు సాధించాడు. జమ్మూకశ్మీర్‌ తరపున అబిద్‌ ముస్తాక్‌ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ కూడా తన పేరిట ఓ సిగ్గుమాలిన రికార్డు సృష్టించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2009లో జార్ఖండ్‌పై త్రిపుర జట్టు కేవలం 30 పరుగులకే కుప్పకూలింది. అంటే, అరుణాచల్ ప్రదేశ్ జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టకుండా తృటిలో తప్పించుకుంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు తప్ప మరే ఇతర జట్టు కూడా 40 పరుగుల కంటే తక్కువ స్కోరుతో ఆలౌట్ కాలేదు.

ఇవి కూడా చదవండి

కేవలం 18 బంతుల్లోనే టీ20 విజయం..

అరుణాచల్ ప్రదేశ్ పేలవ ప్రదర్శన కారణంగా జమ్మూ కాశ్మీర్‌కు ఈ మ్యాచ్‌లో కేవలం 33 పరుగుల విజయలక్ష్యం లభించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎక్కువ సమయం తీసుకోని జమ్మూకశ్మీర్ కేవలం 3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఈ సమయంలో, యుధ్వీర్ సింగ్ 11 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, కమ్రాన్ ఇక్బాల్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంటే, 102 బంతులు మిగిలి ఉండగానే జమ్మూ కాశ్మీర్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇది బంతుల పరంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతిపెద్ద విజయంగా నమోదైంది. అంతకుముందు 2009లో జార్ఖండ్ 100 బంతులు మిగిలి ఉండగానే త్రిపురను ఓడించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us