AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియాకు బిగ్ విలన్ ఇంట్లో విషాదం.. కట్‌చేస్తే.. ఆ 5 సిక్స్‌లే తండ్రి ప్రాణాలు బలిగొన్నాయా..?

ఆసియా కప్ 2025 సందర్భంగా శ్రీలంక స్టార్ ప్లేయర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతని తండ్రి మరణించారు. శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ఆ ఆటగాడు పాల్గొన్నాడు. ఆ మ్యాచ్ తర్వాత అతనికి ఈ విచారకరమైన వార్త అందింది.

టీమిండియాకు బిగ్ విలన్ ఇంట్లో విషాదం.. కట్‌చేస్తే.. ఆ 5 సిక్స్‌లే తండ్రి ప్రాణాలు బలిగొన్నాయా..?
Dunith Wellalage Father Dies
Venkata Chari
|

Updated on: Sep 19, 2025 | 11:33 AM

Share

ఆసియా కప్ 2025 సందర్భంగా ఓ బ్యాడ్ న్యూస్ వెలువడింది. ఒక యువ ఆటగాడు తన తండ్రిని కోల్పోయాడు. సెప్టెంబర్ 18న అబుదాబిలో శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆటగాడు పాల్గొన్నాడు. అయితే, మ్యాచ్ సమయంలో అతని తండ్రి మరణించాడు. మ్యాచ్ తర్వాత, ఆటగాళ్లకు ఈ వార్త తెలియజేయడంతో, జట్టు అంతటా దుఃఖం నెలకొంది. దీంతో ఇప్పుడు ఆ ఆటగాడు టోర్నమెంట్‌లోని రాబోయే మ్యాచ్‌లలో పాల్గొనగలడా లేదా అనే సందేహం తలెత్తింది.

ఈ ఆటగాడి ఇంట్లో విషాదం ఛాయలు..

శ్రీలంక వర్ధమాన క్రికెటర్ దునిత్ వెలలాగే తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. అతని తండ్రి సురంగ వెలలాగే మరణించారు. ఆసియా కప్‌లో అతను ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న రోజే ఈ విషాద సంఘటన జరిగింది. శ్రీలంక ఆ మ్యాచ్‌లో అద్భుతంగా గెలిచి సూపర్ ఫోర్‌లో చోటు సంపాదించింది. వెలలాగే ఈ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. కానీ, మ్యాచ్ ముగిసిన తర్వాతే అతనికి తన తండ్రి మరణ వార్త అందింది. అది అతన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన తర్వాత, దునిత్ వెలలాగే వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఆసియా కప్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో అతను పాల్గొనగలడా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. శ్రీలంక ఇప్పుడు సూపర్ ఫోర్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం వంటి బలమైన జట్లను ఎదుర్కొంటుంది. దునిత్ వెలలాగే లేకపోవడం జట్టుకు సవాలుగా మారవచ్చు.

5 సిక్సర్ల షాక్..

మరణానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు. కానీ, కొన్ని మీడియా నివేదికలు ఈ సంఘటనను మ్యాచ్‌తో ముడిపెడుతున్నాయి. వాస్తవానికి, దునిత్ వెలలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను బౌలింగ్ చేశాడు. ఇది ఖరీదైనదిగా నిరూపితమైంది. ఈ ఓవర్‌లో మహ్మద్ నబీ ఐదు సిక్సర్లు బాదాడు. మొత్తం 32 పరుగులు ఇచ్చాడు. మీడియా నివేదికల ప్రకారం, దునిత్ వెలలాగే తండ్రి ఈ ఓవర్ తర్వాత వెంటనే గుండెపోటుకు గురయ్యాడు. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ సంఘటనపై ఇంకా ఎటువంటి నవీకరణలను విడుదల చేయలేదు.

మ్యాచ్ తర్వాత శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య, జట్టు మేనేజర్ దునిత్ వెల్లగే తన తండ్రి మరణవార్తను అతనికి తెలియజేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మ్యాచ్ తర్వాత ఈ సంఘటన గురించి తెలియగానే ఆఫ్ఘనిస్తాన్ అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ మహ్మద్ నబీ కూడా షాక్ అయ్యాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..