SRH, IPL 2022 Auction: ఆరెంజ్ ఆర్మీలో చేరిన 20 మంది ప్లేయర్లు.. సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి జాబితా ఎలా ఉందంటే?
Sunrisers Hyderabad Auction Players: సన్రైజర్స్ హైదరాబాద్ తన ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, మిగిలిన ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేశారు. వీరిలో కొందరు విదేశీయులు, మరికొందరు భారతీయులు ఉన్నారు.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో (IPL 2022 Auction) సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు చాలా మంది భారతీయ, విదేశీ ఆటగాళ్లపై కూడా పందెం వేసింది. గత సీజన్లో జట్టు ఆటతీరు బాగా లేకపోవడంతో చాలా మంది ఆటగాళ్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ అనే ముగ్గురు ఆటగాళ్లను కొన్ని నెలల క్రితం జట్టు ఉంచుకుంది. రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో హైదరాబాద్ జట్టు 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారి కోసం ఎంత డబ్బు వెచ్చించిందో ఇప్పుడు చూద్దాం..
సన్రైజర్స్ హైదరాబాద్ వేలంలో తీసుకున్న ఆటగాళ్లు..
నికోలస్ పూరన్ – రూ. 10.75 కోట్లు
వాషింగ్టన్ సుందర్ – రూ. 8.75 కోట్లు
రాహుల్ త్రిపాఠి – రూ. 8.50 కోట్లు
భువనేశ్వర్ కుమార్ – రూ. 4.20 కోట్లు
టి నటరాజన్ – రూ. 4 కోట్లు
అభిషేక్ శర్మ – రూ. 6.50 కోట్లు
కార్తీక్ త్యాగి – రూ. 4 కోట్లు
ఫజల్ హక్ ఫరూఖీ – రూ. 50 లక్షలు
గ్లెన్ ఫిలిప్స్ – రూ. 1.50 కోట్లు
విష్ణు వినోద్ – రూ.50 లక్షలు
శశాంక్ సింగ్ – రూ. 20 లక్షలు
సౌరభ్ దూబే – రూ. 20 లక్షలు
రవి కుమార్ సమర్థ్ – రూ. 20 లక్షలు
సీన్ అబాట్ – రూ. 2.40 కోట్లు
రొమారియో స్టాఫోర్డ్ – రూ. 7.75 కోట్లు
మార్కో జెన్సన్ – రూ. 4.20 కోట్లు
ఐదన్ మార్క్రం – రూ. 2.60 కోట్లు
జగదీష్ సుచిత్ – రూ. 20 లక్షలు
శ్రేయాస్ గోపాల్ – రూ. 75 లక్షలు
ప్రియమ్ గార్గ్ – రూ. 20 లక్షలు
సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు..
కేన్ విలియమ్సన్ – రూ. 14 కోట్లు
అబ్దుల్ సమద్ – రూ. 4 కోట్లు
ఉమ్రాన్ మాలిక్ – రూ. 4 కోట్లు
#OrangeArmy, we are Ready To Rise. We repeat. We are #ReadyToRise ?#IPLAuction pic.twitter.com/sQ5zCgFsex
— SunRisers Hyderabad (@SunRisers) February 13, 2022