AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. గ్యారంటీ ఇవ్వలేనంటూ..!

Vaibhav Sooryavanshi Debut: భారత క్రికెట్ భవిష్యత్తుగా మారుతున్న వైభవ్ సూర్యవంశీని మైదానంలో చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా మేనేజ్‌మెంట్ సీనియర్లపైనే నమ్మకం ఉంచాలని భావిస్తోంది. మరి బుధవారం టాస్ పడే సమయానికి ఎలాంటి మార్పులు జరుగుతాయో వేచి చూడాలి.

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. గ్యారంటీ ఇవ్వలేనంటూ..!
Shreyas Iyer, Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: Jul 01, 2026 | 8:05 AM

Share

Vaibhav Sooryavanshi Debut: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభిమానులందరూ ఈ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగుతాడని ఆశగా ఎదురుచూస్తుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

పెరిగిపోతున్న డిమాండ్.. చేతులు ఎత్తేసిన కెప్టెన్..

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున పరుగుల సునామీ సృష్టించిన బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరిగిపోతోంది. అయితే, ఇంగ్లాండ్‌తో బుధవారం జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ ఆడుతాడా లేదా అనే విషయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో అయ్యర్ మాట్లాడుతూ, తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని, ప్రస్తుతానికి తాము జట్టు సమతుల్యతకే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు..

ఇవి కూడా చదవండి

సీనియర్లకే మా మద్దతు.. అయ్యర్ క్లారిటీ..

ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను సున్నా-రెండుతో కోల్పోయిన భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇటువంటి కీలక సమయంలో ప్రయోగాలు చేయడం కంటే, గత ప్రపంచకప్ గెలిచిన సీనియర్ ఆటగాళ్లకు అండగా నిలవడం చాలా ముఖ్యమని శ్రేయస్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ గెలిచిన సీనియర్లకు టీ20 ఫార్మాట్‌లో ఎలా ఆడాలో పూర్తి అవగాహన ఉందని, వారే ఈ జట్టుకు ప్రధాన స్తంభాలని అయ్యర్ పేర్కొన్నారు. అందువల్ల వారికి తగినన్ని అవకాశాలు ఇచ్చి, జట్టులో భద్రతా భావాన్ని కల్పించడమే తమ ప్రస్తుత లక్ష్యమని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!

వేచి చూడక తప్పని పరిస్థితి..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏకంగా 776 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ, ఆ తర్వాత ఇండియా-ఎ తరపున శ్రీలంకలో కేవలం 11 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. ఇంతటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం మేనేజ్‌మెంట్‌కు కూడా కష్టంగానే ఉన్నప్పటికీ, జట్టు తత్వశాస్త్రం ప్రకారం గత రెండేళ్లుగా రాణిస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కెప్టెన్ మాటలను బట్టి అర్థమవుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం దక్కితే, భారత అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు. కానీ అయ్యర్ వ్యాఖ్యల తర్వాత అతను మరికొంత కాలం నిరీక్షించక తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us