AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!

ఢిల్లీ సిక్సర్… మెరిసిన ధావన్, శ్రేయాస్ రాణించిన బౌలర్లు.. గేల్ అర్ధ సెంచరీ వృధా   ఢిల్లీ: ఐపీఎల్ 12వ సీజన్ లో ఇప్పటివరకు పది మ్యాచులు ఆడిన ఢిల్లీ.. ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ […]

ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!
Ravi Kiran
|

Updated on: Apr 21, 2019 | 7:56 AM

Share
  • ఢిల్లీ సిక్సర్…
  • మెరిసిన ధావన్, శ్రేయాస్
  • రాణించిన బౌలర్లు..
  • గేల్ అర్ధ సెంచరీ వృధా

ఢిల్లీ: ఐపీఎల్ 12వ సీజన్ లో ఇప్పటివరకు పది మ్యాచులు ఆడిన ఢిల్లీ.. ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (69; 37 బంతుల్లో 6×4, 5×6) జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో సందీప్‌ లమిచానె (3/40), కాగిసో రబాడ (2/23), అక్షర్‌ పటేల్‌ (2/22) రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు శిఖర్‌ ధావన్‌ (56; 41 బంతుల్లో 7×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (58 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 1×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. దీనితో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.