AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MCA: IPL తరువాత మీకు నో రెస్ట్! ముంబై స్టార్ ఆటగాళ్లకు వార్నింగ్

ముంబై టీ20 లీగ్‌ను మళ్లీ గ్రాండ్‌గా ప్రారంభించేందుకు మహా క్రికెట్ అసోసియేషన్ (MCA) సన్నాహాలు చేస్తోంది. రోహిత్ శర్మను లీగ్ అంబాసిడర్‌గా ప్రకటించిన MCA, IPL ముగిసిన తర్వాత ముంబైకి చెందిన స్టార్ ఆటగాళ్లంతా ఈ లీగ్‌లో పాల్గొనాలని ఆశిస్తోంది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా, ఐకాన్ ప్లేయర్లకు రూ.15 లక్షల ప్రత్యేక జీతం ఇవ్వాలని కూడా యోచిస్తోంది. ఈ లీగ్ ద్వారా ముంబై క్రికెట్‌కు పునర్జీవం అందించాలనే దిశగా MCA కృషి చేస్తోంది.

MCA: IPL తరువాత మీకు నో రెస్ట్! ముంబై స్టార్ ఆటగాళ్లకు వార్నింగ్
Mca Players
Narsimha
|

Updated on: Apr 17, 2025 | 6:33 PM

Share

టీ20 ముంబై లీగ్ గురించి ప్రముఖ ముంబై క్రికెటర్లకు మహా క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి స్పష్టమైన సందేశం వచ్చింది. భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా నియమించబడ్డాడు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్లు మధ్యలో నిలిపివేసిన ఈ లీగ్ 2018, 2019లలో విజయవంతంగా జరిగింది. ఇప్పుడు మళ్లీ ఈ టోర్నమెంట్ గ్రాండ్ గా తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ముంబైకు చెందిన స్టార్ ఆటగాళ్లైన సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహానే, శివం దుబే, తుషార్ దేశ్‌పాండే, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లంతా ఈ లీగ్‌లో పాల్గొనాలని MCA ఆశాభావం వ్యక్తం చేసింది. వారి IPL షెడ్యూల్ పూర్తయ్యే మే 25 తర్వాతే ఈ లీగ్ ప్రారంభం కానుంది.

MCA ఒక అధికారి మాట్లాడుతూ, “వారు ఈ లీగ్‌లో తప్పనిసరిగా ఆడాలనే నిబంధన లేదు. కానీ మేము గట్టిగా ఆశిస్తున్నాం. ఎందుకంటే వారి భాగస్వామ్యం ముంబై క్రికెట్ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. అంతేకాకుండా, ఈ లీగ్‌కు, పాల్గొనే యువ ఆటగాళ్లకు ప్రేరణ కలుగుతుంది” అని చెప్పారు. రోహిత్ శర్మ శుక్రవారం జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా లీగ్ అధికారికంగా ప్రారంభం కానుంది.

ఈ టోర్నమెంట్ కోసం 2,800 కంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చినట్లు MCA వెల్లడించింది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో పాల్గొంటాయి. ఇందులో ఇప్పటికే ఉన్న ఆరు జట్లు నార్త్ ముంబై పాంథర్స్, ARCS అంధేరీ, ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్, నమో బాంద్రా బ్లాస్టర్స్, ఈగిల్ థానే స్ట్రైకర్స్, ఆకాష్ టైగర్స్ ముంబై వెస్ట్రన్ సబర్బ్స్ కాగా, మిగిలిన రెండు కొత్త జట్ల పేర్లు త్వరలో ప్రకటించనున్నారు.

ఇక “ఐకాన్ ప్లేయర్స్‌”కు ప్రత్యేకంగా రూ. 15 లక్షల జీతం ఇవ్వాలనే ఆలోచన కూడా MCAలో జరుగుతోంది. ఇది ఆటగాళ్లలో ఆసక్తిని పెంచేలా, లీగ్‌కు మరింత క్రేజ్ తీసుకురావడంలో కీలకంగా మారనుంది. రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్స్‌కు వీడ్కోలు పలికినా, ఐపీఎల్‌లో ఇంకా కొనసాగుతున్నాడు. ఇప్పుడు తన సిటీకి ప్రతినిధిగా ముంబై లీగ్‌కు అంబాసిడర్‌గా మారడం గర్వకారణంగా మారింది. అతని సమర్ధనతో ఈ లీగ్ మళ్లీ ముంబై క్రికెట్‌కు కొత్త శక్తిని అందించనుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..