AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2022: అదే భారత జట్టుకు రెగ్యులర్‌గా కావాల్సింది.. మాజీ క్రికెటర్ కీలక ప్రకటన..

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు రోహిత్ శర్మకు కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

IND vs ENG 2022: అదే భారత జట్టుకు రెగ్యులర్‌గా కావాల్సింది.. మాజీ క్రికెటర్ కీలక ప్రకటన..
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Jul 06, 2022 | 9:07 PM

Share

జూన్ 7న భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నిజానికి, ఇంగ్లండ్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు రోహిత్ శర్మకు కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. తాజాగా రోహిత్ శర్మ కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా తిరిగి రావడంపై భారత మాజీ ఆటగాడు దీప్ దాస్‌గుప్తా కీలక ప్రకటన చేశాడు.

‘భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ ఉండటం చాలా ముఖ్యం’

రోహిత్ శర్మ పునరాగమనం భారత జట్టుకు మేలు చేస్తుందని దీప్ దాస్‌గుప్తా అన్నాడు. భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ ఉండటం చాలా ముఖ్యమని అన్నాడు. నిజానికి గత కొన్ని నెలలుగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల సందర్భంగా భారత జట్టు కెప్టెన్‌లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా 2-3 నెలల సమయం మాత్రమే ఉందని, అందుకే గతంలో ఎంతో మంది ఆకట్టుకున్న ఆటగాళ్లు ఉన్నారని భారత మాజీ ఆటగాడు చెప్పుకొచ్చాడు. అలాంటి ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌కు ముందు సెలక్టర్లను మెప్పించే గొప్ప అవకాశం కూడా ఉందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (WK), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్