AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 90 ఏళ్ల చరిత్ర రిపీట్.. మరోసారి అదే మ్యాజిక్‌తో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు.. అదేంటంటే?

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అశ్విన్, శ్రేయాస్ అయ్యర్‌ల భాగస్వామ్యం జట్టును విజయపథంలోకి తీసుకెళ్లింది.

Team India: 90 ఏళ్ల చరిత్ర రిపీట్.. మరోసారి అదే మ్యాజిక్‌తో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు.. అదేంటంటే?
Team India
Venkata Chari
|

Updated on: Dec 26, 2022 | 5:46 AM

Share

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించేందుకు భారత జట్టు 145 పరుగులు చేయాల్సి ఉండగా, టీమిండియా 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం అశ్విన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య రికార్డు స్థాయిలో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిజానికి భారత టెస్టు చరిత్రలో 8వ వికెట్‌కు ఇది రెండో అతిపెద్ద భాగస్వామ్యంగా నిలిచింది. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఎల్ శివరామకృష్ణన్ జోడీ మూడో స్థానంలో ఉంది.

90 ఏళ్ల చరిత్ర పునరావృతం..

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ దేవ్, ఎల్ శివరామకృష్ణన్ మధ్య 8వ వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ఉంది. ఈ మ్యాచ్ 1985లో కొలంబో క్రికెట్ గ్రౌండ్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగింది. అదే సమయంలో, లాల్ సింగ్, అమర్ సింగ్ జంట ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాల్ సింగ్, అమర్ సింగ్ 8వ వికెట్‌కు 74 పరుగులు జోడించారు. చారిత్రాత్మకమైన లార్డ్స్ మైదానంలో 1932లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ టెస్టు మ్యాచ్ జరిగింది. ఇది కాకుండా భారత్‌కు టెస్టు చరిత్రలో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.

బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్‌..

భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 227 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 314 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 231 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు విజయానికి 145 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, టీమిండియా 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత, అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ మధ్య 71 పరుగుల భాగస్వామ్యంతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో భారత జట్టు బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీస్ చేసి, టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..