టీమిండియాలో చోటు ఇప్పుడంత ఈజీ కాదు.. ఎందుకంటే ద్రావిడ్‌ రూల్స్‌ మారుస్తున్నాడుగా..?

Team India: విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి జంట టెస్ట్ ఫార్మాట్‌లో చాలా విజయాలు సాధించి ఉండవచ్చు అయితే ఈ జంట ప్రవేశపెట్టిన కొన్ని నియమాలు ఇప్పుడు

టీమిండియాలో చోటు ఇప్పుడంత ఈజీ కాదు.. ఎందుకంటే ద్రావిడ్‌ రూల్స్‌ మారుస్తున్నాడుగా..?
Rahul Dravid
Follow us

|

Updated on: Dec 10, 2021 | 7:25 PM

Team India: విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి జంట టెస్ట్ ఫార్మాట్‌లో చాలా విజయాలు సాధించి ఉండవచ్చు అయితే ఈ జంట ప్రవేశపెట్టిన కొన్ని నియమాలు ఇప్పుడు కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్చడం ప్రారంభించాడు. మీడియా నివేదికల ప్రకారం.. రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు అనిల్ కుంబ్లే విధానాన్ని పాటిస్తున్నాడు. దీని ప్రకారం అన్‌ఫిట్, పేలవమైన ఫామ్ ఉన్న ఆటగాళ్లు టీమ్ ఇండియాలో స్థానం పొందడానికి దేశీయ క్రికెట్ ఆడవలసి ఉంటుంది. రవిశాస్త్రి హయాంలో ఆగిపోయినా రాహుల్ ద్రవిడ్ ఈ పద్దతిని మళ్లీ ప్రారంభించాడు.

టీ20 ప్రపంచకప్ 2021లో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడమే దీనికి కారణం. ఇది టీమిండియా ఓటమికి కారణం అయింది. ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యా ఎంపిక కారణంగా రాహుల్ ద్రవిడ్ ఈ విధానాన్ని తిరిగి ప్రారంభించాడు. శస్త్రచికిత్స తర్వాత హార్దిక్ పాండ్యా నేరుగా IPL ఆడాడు. కానీ బౌలింగ్ మాత్రం చేయలేదు. అంతేకాకుండా బ్యాట్‌తో కూడా పేలవ ప్రదర్శన చేశాడు. ఇంత జరిగినా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ కోచ్ అయిన వెంటనే హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు అతను పూర్తి ఫిట్‌గా ఉంటేనే జట్టులోకి రాగలడు. దేశవాళీ క్రికెట్‌లో తనను తాను కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తున్న రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ ఆధారంగా ఆటగాళ్ల ఎంపికను నిలిపివేయాలని రాహుల్ ద్రవిడ్ నిర్ణయించాడు. ఐపీఎల్ ఆధారంగా ఏ ఆటగాడు టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేడు. అలాగే, ఒక ఆటగాడు పునరాగమనం చేయవలసి వస్తే అతను తన మ్యాచ్ ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరూపించుకోవాలి. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా క్రికెట్‌కు దూరంగా ఉండటంతో పాటు విజయ్ హజారే ట్రోఫీ నుంచి కూడా తన పేరును ఉపసంహరించుకోవడంతో తిరిగి రావడం కష్టం.

దీంతో సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా పేరును పరిగణనలోకి తీసుకోలేదు. BCCI అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ “విధానం ఎప్పుడూ మార్చలేదు కానీ గత కొన్ని సంవత్సరాలుగా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడడాన్ని రాహుల్ ద్రవిడ్ తప్పనిసరి చేశాడు. మీరు గాయం తర్వాత కోలుకున్నట్లయితే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని” చెప్పాడు.

ఎవ్వరైనా సరే దుబాయ్‌ వెళితే బంగారం కొంటారు..! ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..?

జ్ఞాపకశక్తి, కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..?

వైట్‌ రైస్‌, బ్రౌన్‌ రైస్‌కి తేడాలేంటి..? వైట్‌రైస్‌ కంటే బ్రౌన్‌ రైస్‌ ఎందుకు మంచిది..?