AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs ENG: పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్.. 4-3 తేడాతో సిరీస్ కైవసం.. ఆ విషయంలో బాబర్ సేన ఘోర వైఫల్యం..

ఇంగ్లండ్ టీం 67 పరుగులతో విజయం సాధించింది. పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 142 పరుగులు చేసి, భారీ తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ టీం 4-3తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

PAK vs ENG: పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్.. 4-3 తేడాతో సిరీస్ కైవసం.. ఆ విషయంలో బాబర్ సేన ఘోర వైఫల్యం..
Pak Vs Eng
Venkata Chari
|

Updated on: Oct 03, 2022 | 1:07 AM

Share

17 ఏళ్లుగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు రాక కోసం ఎదురుచూసిన పాకిస్థాన్‌కు చివరకు నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లి టీ20 సిరీస్ ఆడటంతో అభిమానులను సంతోషంగా ఉండేందుకు అవకాశం ఇచ్చింది. కానీ, ఆతిథ్య జట్టుకు మాత్రం ఇంగ్లండ్ షాక్ ఇచ్చింది. ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 67 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి, మ్యాచ్‌తో ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాక్ అభిమానులకు ఆ సంతోషం లేకుండా చేసింది.

టీ20 ప్రపంచకప్‌నకు ముందు అందరి చూపు ఈ చరిత్రాత్మక సిరీస్‌పైనే నిలిచింది. కరాచీలో నాలుగు మ్యాచ్‌లు, లాహోర్‌లో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ల వరకు సిరీస్ చాలా పోటీగా ఉంది. దీంతో స్కోరు 3-3తో సమమైంది. అయితే గత మ్యాచ్‌లో ఏకపక్ష మ్యాచ్‌లా కాకుండా.. ఈ మ్యాచ్‌లోనూ మరోసారి పాక్ బ్యాటింగ్, ఫీల్డింగ్ బట్టబయలైంది.

మలన్-బ్రూక్ దాడితో పాక్ గల్లంతు..

ఇవి కూడా చదవండి

అక్టోబరు 2 ఆదివారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన సిరీస్ డిసైడర్‌లో ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. డేవిడ్ మలాన్ (78 నాటౌట్, 47 బంతులు), యువ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ (46 నాటౌట్, 29 బంతులు) పాక్ బౌలర్లపై చెలరేగి 61 బంతుల్లో 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు తోడు పాకిస్థాన్‌ పేలవ ఫీల్డింగ్‌ కూడా దోహదపడింది. కెప్టెన్ బాబర్ ఆజం రెండు సులువైన క్యాచ్‌లను వదిలేశాడు. దీంతో కీలక మ్యాచ్‌లో పాక్ ఫీల్డింగ్ వైఫల్యం మరోసారి కనిపించింది.

బాబర్-రిజ్వాన్ త్వరగా పెవిలియన్..

అదే సమయంలో, గత కొన్ని మ్యాచ్‌ల్లో టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ బాబర్, మహ్మద్ రిజ్వాన్‌ల జోడీ అద్బుతంగా ఆకట్టుకుంటోంది. ఈ జోడీ ఇన్నింగ్స్ ఆధారంగా మాత్రమే పాకిస్తాన్ జట్టు లక్ష్యాన్ని సాధిస్తూ వస్తోంది. పాక్ జట్టు మిడిల్ ఆర్డర్ తక్కువగా ఆడడం లేదా వారికి ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో ఫ్లాప్ అయింది. అయితే, ఈసారి బాబర్-రిజ్వాన్ జోడీ మాత్రం.. ఈ మ్యాచ్‌లో త్వరగా పెవిలియన్ చేరారు. దీంతో ప్రపంచ కప్‌నకు ముందు పాకిస్తాన్ బలహీనమైన మిడిల్ ఆర్డర్‌కు మరొక ఉదాహరణ కనిపించింది.

మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ షో..

బాబర్ (4), రిజ్వాన్ (1) ఇన్నింగ్స్ ప్రారంభంలో 5 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిడిలార్డర్‌కు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం వచ్చినా షాన్ మసూద్ (56 పరుగులు, 43 బంతుల్లో) మినహా ఎవరూ స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ఖుష్దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్ నిలిచినా వేగంగా పరుగులు చేయలేకపోయారు. మిగతా బ్యాట్స్‌మెన్ పదుల స్కోరును కూడా అందుకోలేకపోయారు.

క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్ అద్భుతమైన బౌలింగ్, కొన్ని మంచి క్యాచ్‌లతో, ఇంగ్లండ్ టీం 67 పరుగులతో విజయం సాధించింది. పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 142 పరుగులు చేసి, భారీ తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ టీం 4-3తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.