Border-Gavaskar trophy: నెట్ సెషన్లకు నో ఎంట్రీ! అభిమానులను దూరం ఉంచిన భారత జట్టు… అసలు కారణం ఇదే
నెట్ సెషన్లు ప్రైవేట్గా ఉంచాలని భారత జట్టు నిర్ణయించింది, వ్యూహ చర్చల భద్రతకోసం అని రోహిత్ శర్మ వివరించాడు. అడిలైడ్ టెస్ట్ తర్వాత, రోహిత్ ఈ నిర్ణయాన్ని హాస్యంతో సమర్థించాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో విజయాల కోసం జట్టు ఇప్పుడు ముందుకు చూడాల్సిన అవసరం ఉంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో నెట్ సెషన్లకు అభిమానులను దూరంగా ఉంచాలనే టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన స్పందన తెలియజేశాడు. అడిలైడ్ టెస్టు అనంతరం రోహిత్ ఈ నిర్ణయానికి ఉన్న అసలు కారణాలను వెల్లడించాడు. నెట్ సెషన్లు ప్రైవేట్గా ఉండాలని భావించటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే ప్రాక్టీస్ సమయంలో జట్టులో చాలా కీలకమైన చర్చలు, వ్యూహాలు జరుగుతాయి అని శర్మ పేర్కొన్నారు.
పింక్ బాల్ టెస్టు ముందు, భారత ప్రాక్టీస్ సెషన్లు ప్రేక్షకులకు తెరవబడ్డాయి, కానీ ఆ సమయంలో కొన్ని అసౌకర్యాలు తలెత్తాయి. కొంతమంది అభిమానులు ఆటగాళ్లపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో అది ఆటగాళ్ల దృష్టిని మళ్లించింది. “నెట్ సెషన్లు ప్రైవేట్గా ఉండాలి, ఎందుకంటే ప్లేయర్లు తమ వ్యూహాలను చర్చించటం, వాటిని అమలు చేయటం వంటి పనులు చేయాలి. ఇది చాలా సున్నితమైన విషయం,” అని రోహిత్ వివరించాడు.
ఒక వేళా ఆటగాళ్ళని చూడటానికి ఆసక్తి ఉంటే, అభిమానులు మ్యాచ్ సమయంలో రావచ్చు. ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ ఉంది. వారు ఆ సమయంలో మమ్మల్ని ప్రోత్సహించగలరు అని రోహిత్ హాస్యంగా చెప్పారు.
అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా భారత జట్టుపై పది వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా వారి పాయింట్ల శాతాన్ని 60.71కి పెంచి, దక్షిణాఫ్రికా, భారత్ను అధిగమించింది.
ఇదిలా ఉండగా, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు, మొదటి టెస్టులో విజయం సాధించినప్పటికీ, రెండో టెస్టులో ఓటమితో 61.11 పాయింట్ల శాతం నుంచి 57.29కి తగ్గిపోయింది.
2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవాలంటే, భారత్ ఆస్ట్రేలియాతో జరగనున్న బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది. ఇది జట్టు కోసం ముఖ్యమైన సవాల్గా నిలుస్తోంది.



