AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: అదే మాకు కలిసొచ్చింది..కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ కీలక వ్యాఖ్యలు..

రోహిత్ శర్మ చేసిన పొరపాటు నుంచి తాను తప్పించుకున్నట్లు కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ చెప్పాడు. అయితే, మ్యాచ్ తర్వాత, లాథమ్ కీలక విషయాలను పంచుకున్నాడు. ఇంతకీ కివీస్ గెలవడానికి కారణమేంటో తెలుసా?

IND vs NZ: అదే మాకు కలిసొచ్చింది..కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ కీలక వ్యాఖ్యలు..
Tom Latham
Velpula Bharath Rao
|

Updated on: Oct 20, 2024 | 9:31 PM

Share

బెంగళూరులో ప్రారంభమైన టెస్ట్‌లో ఐదవ రోజు చివరి రోజున న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ముప్పై ఆరేళ్ల తర్వాత భారత గడ్డపై తమ తొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. టామ్ లాథమ్ నాయకత్వంలో, కివీస్ అన్ని విధాలుగా భారత్‌ను అధిగమించింది. ప్రారంభ సెషన్‌లో ఆతిథ్య జట్టును కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 1988 తర్వాత భారత గడ్డపై వారికిది మొదటిది. అయితే, మ్యాచ్ తర్వాత, లాథమ్ కీలక విషయాలను పంచుకున్నాడు. రోహిత్ శర్మ చేసిన పొరపాటు నుంచి తాను తప్పించుకున్నట్లు చెప్పారు.

తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తరువాత అతను పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడని లాథమ్ చెప్పాడు. అప్పుడు, తాను టాస్ గెలిచిన అలాగే తీసుకునేవాడినన్ని, అయితే రోహిత్ శర్మ టాస్ గెలవడంతో తమకు కలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు. చివరి రోజు ఆటలో, న్యూజిలాండ్ 107 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఎనిమిది ఓవర్లలో 29 పరుగులకు రెండు వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ గెలిపించాలనే ప్రయత్నాలు చేశాడు. 39 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్న రచిన్ రవీంద్ర, 48 పరుగుల వద్ద అజేయంగా నిలిచిన విల్ యంగ్ మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించి పటిష్ట భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కేవలం 27.4 ఓవర్లలోనే రచిన్‌, యంగ్‌లు న్యూజిలాండ్‌ను ఈ మార్కును సాధించగలిగారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి