AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ప్లే ఆఫ్స్‌లోకి ముంబై ఎంట్రీ.. కట్‌చేస్తే.. ఫైనల్ చేరుకోకుండానే ఆర్‌సీబీ ఔట్.. మరోసారి కన్నీళ్లేగా

Mumbai Indians, IPL 2025: ముంబై ఇండియన్స్ IPL 2025 ప్లేఆఫ్స్‌లోకి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే అర్హత సాధించాయి. ముంబైకి వచ్చిన తర్వాత సోఆర్‌సీబీపై మీమ్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

IPL 2025: ప్లే ఆఫ్స్‌లోకి ముంబై ఎంట్రీ.. కట్‌చేస్తే.. ఫైనల్ చేరుకోకుండానే ఆర్‌సీబీ ఔట్.. మరోసారి కన్నీళ్లేగా
Mumbai Indians Vs Royal Challengers Bengaluru
Venkata Chari
|

Updated on: May 22, 2025 | 3:30 PM

Share

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ముంబై కంటే ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. పంజాబ్, ఆర్‌సీబీ జట్లు ఇంకా టైటిల్ గెలవలేదు. మరోవైపు, ముంబైకి ట్రోఫీలు ఎలా గెలవాలో తెలుసు. ఆ జట్టు ఇప్పటివరకు 6 సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడింది. 5 సార్లు టైటిల్ గెలుచుకుంది.

ప్లేఆఫ్స్‌లో ముంబైకి బలమైన రికార్డు..

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ముంబై ఇండియన్స్‌కు బలమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు ప్లేఆఫ్స్‌లో మొత్తం 20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ముంబై జట్టు 13 విజయాలు, 7 ఓటములను చవిచూసింది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ముంబై జట్టుకు ట్రోఫీలు ఎలా గెలవాలో తెలుసు. ఆ జట్టుకు ఇద్దరు భారత జట్టు కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్ట్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కూడా ముంబై జట్టులో ఉన్నాడు. అందరూ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో మీమ్స్..

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో, సోషల్ మీడియాలో చాలా మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అభిమానులు ఆర్‌సీబీ, పంజాబ్, గుజరాత్‌లను ట్రోల్ చేస్తున్నారు. ముంబై ప్లేఆఫ్‌లోకి ప్రవేశించడం వల్ల మూడు జట్లలో భయం వాతావరణం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోందంటూ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు.

బుమ్రా వచ్చిన తర్వాత ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయిన ముంబై..

గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు. అతను లేకుండా ముంబై జట్టు 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. కానీ, బుమ్రా వచ్చిన తర్వాత ముంబై 8 మ్యాచ్‌ల్లో 7 గెలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన వర్షం ప్రభావిత మ్యాచ్‌లో మాత్రమే ముంబై చివరి బంతికి ఓడిపోయింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..